24, నవంబర్ 2011, గురువారం

అందరి చూపులు అటు వైపే...

అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇండియా నుండి వెళ్తున్న విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతోంది. దీంతో చివరకి తమ పిల్లలు హైస్కూలు విద్యను అభ్యసించేందుకుకూడా ఇబ్బందులు రావటం ఖాయమని అమెరికాలోని అనేక కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
ప్రపంచంలో అమెరికాలో ఎక్కువగా విద్యను అభ్యసించే వారిలో భారత్‌ విద్యార్థులు రెండవ స్థానంలో ఉన్నారు. చైనాతో పోలిస్తే మన విద్యార్థులు ఏటా 10 లక్షల 50వేల మంది 2009-10లో ఉన్నట్లు అమెరికా పేర్కొంది. అమెరికాలో చదివేందుకు వెళ్లే విద్యార్థుల విసాలు ప్రస్తుతం 20 శాతం పెరిగినట్లు అమెరికా రాయబార కార్యాలయం సమాచారం.
ఇంతలా అమెరికాలో భారత విద్యార్ధులు పెరిగిపోవటానికి ముఖ్య కారణం అమెరికాలోని ఎన్నో విద్యాసంస్థలు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకునేందుకు భారత్‌లో అనేక బ్రాంచీలను ఏర్పాటు చేసుకుంటు..భారత్‌లో సంబంధాలు పెంచుకునే దిశలో యుఎస్‌ - భార త్‌ ఉన్నత విద్యా అవగాహన సదస్సులను జార్జ్‌టౌన్‌ యూని వర్సి టీ వివిధ దేశాలలో భాగస్వామ్య మీటింగ్‌లు చేస్తూ... విద్యార్ధుల ను తమ వైపు ఆకర్షిస్తోంది.
మెజారిటీ మనదే...
ఇక అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించే వారిలో మెజారిటీ విద్యార్థులు భారత్‌కు చెందిన వారే కాగా... ఇప్పుడు ప్రాథమిక విద్యను అభ్యసించేం దుకు తమ బిడ్డలకి అమెరికానే మార్గంగా ఇండియాలో ధనవంతులైన తల్లిదండ్రులు నిర్ణయించుకోగా... ఆదిశగా మధ్య తరగతి కుటుంబాలకు కూడా యత్నిస్తుండటంతో... 'సేఫ్టీ స్కూల్స్‌' పేరుతో సంవత్సరాది పరీక్షల్లో చాలావరకు కోతలు విధిస్తూండటంతో మున్ముం దు తమ బిడ్డల జీవితాలేమైపోతాయో అని తల్లి దండ్రులు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియాలో విద్యార్థులకు పరిమిత సీట్లు విధించడం, సీటు లభించకపోవడంతో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలకోసం అమెరికాను ఆశ్రయిస్తున్నారు. అలాగ కొన్ని ప్రాముఖ్యమైన కోర్సులైన ఆర్థికశాస్త్రం, గణాంకాలు, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ కోర్సులను అభ్యసిం చేందుకు వెళుతున్నారు.
నాలాగే ఎందరో...
మాలశ్రీ మోహన్‌ అనే ప్రతిభావంతురాలై విద్యార్ధిని పాఠశాల విద్యానం తరం ఆమె తల్లిదండ్రులు ఇండియాలొన ప్రాధాన్యత గల కళాశాలలో తమ కూతురును చేర్పించాలని అనుకున్నారు. ఢిల్లిdలోని ఢిల్లిd యూని వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటే... సీటు లభించలేదు. అయితే యుఎస్‌లోని డార్ట్‌మౌత్‌లో ఓ కళాశాలకు సరదా గా ఆమె చేసిన ధరఖాస్తు....20వేల అమెరికన్‌ డాలర్ల స్కాలర్‌షిప్‌తో సీటిస్తామని ఆహ్వానించింది. నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారం టొరదామె.. గ్రేడ్‌ వన్‌ మార్కులతో పాసైన తమ కూతురుకు ఇక్కడ సీటు రాకపోవడమేంటని తన మార్కులు చూసి ఆశ్చ్యర్యానికి గురైన ఆమె తల్లి మాధవి చంద్రఈ విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొంది.
అలాగే మరో విద్యార్ధికి 1500వేల డాలర్ల స్కాలర్స్‌తో స్మిత్‌ నుంచి స్వాగతించడంపై సంభ్రమాశ్చ్యర్యాలకు గురయ్యారు. ఇలా పలువురు ప్రతిభావంతులైన విద్యార్ధులకు భారత్‌లో ఉన్నత స్ధానం మాదే అని చెప్పుకునే కాలేజీల్లో సీటు దక్కకపోగా కోర్నెల్‌, బ్రయాన్‌ మార్‌, డ్యూక్‌, వెస్లియాన్‌, బార్‌నార్‌డ్‌, అంతేగాక యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా నుంచి కళాశాల విద్యకోసం అవ కాశాలు లభించాయి.
ఇక్కడ కాదంటే... అక్కడ ఫ్రీ
అలాగే నిఖిత ఢిల్లిd పబ్లిక్‌ స్కూల్‌ నుంచి 2010 నుంచి గ్రాడ్యుయేట్‌లో ఉత్తీర్ణురాలయ్యింది. ఈమెకు 94.5 శాతం ఉత్తీర్ణత సాధించింది. అయితే ఆమెకు ఎకనామిక్స్‌ సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రాకపోవడంతో ఆమెకు సీటు ఇవ్వడంలో సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నిరాకరించింది. అప్పుడే నిఖిత ఒక సంవత్స రం ఖాళీగానే ఉండి అమెరికాలోని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు దరఖాస్తు చేసుకోగా అమెరికన్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌లో ఉచితంగా సీటు లభించింది.
అయితే ఈ విద్యార్ధులంతా పాఠశాల విద్యలో 93.5 శాతం పైగా అత్యధిక మార్కులు సాధించిన వారే కావటం విశేషం.ఇలా అత్యధిక పోటీ ఉన్న తరుణంలో ఒక భారత్‌లో తప్పా... ప్రపంచంలోని అన్ని దేశాలూ అత్యధిక ప్రతిభావంతులైన విద్యార్థులకు తమ దేశాల్లోని విద్యాసంస్ధలలో అవకాశాలు అందించడం కొసమెరుపు. ఏటా విదేశాల్లో ఉన్నత విద్యలను అభ్యసించేందుకు వెళుతున్న భారత్‌ విద్యార్థులలో 1.2 బిలియన్‌ మంది 25 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన వారే ఉండటం గమనార్హం. దేశంలో అత్యధిక విజ్ఞానవంతులైన విద్యార్థులు ఇతర దేశాలకు ఎంపిక అవుతుండగా... వీరిలో మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ గా ఉండటం ఆసక్తికర విషయమే...
డిస్టెన్స్‌ విద్యార్ధుల పరిస్ధితేంటో...
100 శాతం వరకు మార్కులు వచ్చినప్పటికీ సీటు ఇవ్వ డంలో మన భారత యూనివర్శిటీలు విఫలమవుతున్న నేపధ్యంలో ఇక డిస్టెన్స్‌, గ్రేడ్‌ వన్‌ స్టూడెంట్స్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించా ల్సిన విషయమే. ఇండియన్‌ ఇన్‌ స్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి భారత్‌లో విస్తరిం చింనా... తీసుకునే సీట్ల సంఖ్య మాత్రం రెండు శాతం కంటే తక్కువే.. రెండు సంవత్సరాలు ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకుంటున్నప్పటికీ సీటు లభించడంలేదు.
ప్రమాణాలు మించి చదువుకోవడానికే ...
కాగా...మన వద్ద లభించే ఉన్నత విద్యా ప్రమాణాలు మించి చదువుకోవ డానికే బయటి దేశాలకు వెళుతున్నారని... కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ అభిప్రాయ పడటం విడ్డూరంగా ఉంది.
భారత విద్యార్థులను విదేశాలకు ప్రమోట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లిd యూనివర్సిటీ ఇలా మంచి మార్కులు వచ్చిన విద్యార్ధులకు సీట్లు ఇవ్వకుండా పోతోందని... అనేక మంది ఆరొపణలు వస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవట్లేదని... తల్లిదండ్రుల ఆరోపణ.
చికాగో యూనివర్సిటీలో ఆర్థిక ప్రణాళిక శాఖ వ్యాసకర్తగా స్థిరపడిన భారత్‌కు చెందిన నిఖిత స్కాదేవ్‌ మాట్లాడుతూ... భారత్‌లో అవకాశాలు రాకపోతే చింతించ వద్దని...ఇంగ్లీష్‌ ప్రావిణ్యత పెంచుకుంటూ పోతే... అది మీ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తుందని అభిప్రాయ పడ్డారు. ఇండియన్‌ ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజి సైన్స్‌ సంస్థలో విద్యను అభ్యసించిన సిద్ధార్థ పూరి అనే విద్యార్థి కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావలనేది అతని కోరిక. అయితే భారత్‌లో అవకాశాలు సన్నగిల్లడంతో... జర్మని భాషలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ను యూనివర్సిటీ ఆఫ్‌ కాలి ఫోర్నియా, బెర్కిలిలో చేరే అవకాశం రావటంతో అక్కడ చేరి పోయాడు. ఇదే విషయంపై బ్రౌన్‌ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ సంబంధాల వ్యవహారాల చైర్మన్‌ మాథ్యూ గౌతమ్‌ మాట్లాడుతూ... మేథోసంపత్తి గల విద్యార్థులను పెంచుకునేం దుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని దీనికి భారత్‌లోని ఢిల్లిdలో విద్యార్థులను ఎంపిక చేసుకునేందుకు ఒక కార్యాలయాన్ని ప్రారంభించి ఎక్కువగా మందిని ఈ విద్యా సంవత్సరం ఎంపిక చేసుకో వడమే లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. ఇండియాలో అన్నింటికంటే ముఖ్యంగా తమ పిల్లల చదువుకోసమే ఎక్కువ ధనాన్ని వెచ్చించేందుకు మధ్య తరగతి కుటుంబాలు ఇష్టపడుతున్నాయి. ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రసిడెంట్‌ ఆలెన్‌ గూడ్‌మెన్‌ అన్నారు.