16, డిసెంబర్ 2011, శుక్రవారం

శత వసంతాల రాజధాని ఢిల్లీ

కౌరవ సామ్ర్రాజ్యానికి రాజధానిగా నిలచిన హస్తిన...
మొఘలాయీ చక్రవర్తుల మొదలు ఎందరి పాలనకో రాజధానిగా నిలచి...
ఆపై జార్జి వి చక్రవర్తి పాలనలో రెండో సారి రాజధానిగా ప్రకటించబడి...
దినదినాభివృద్ధి చెందుతూ... వందేళ్లు పూర్తి చేసుకుని...
ఏడాది పాటు శతవసంతాల సంబరాలు జరుపుకుంటోంది.
ఢిల్లీకి హస్తినగా దాదాపు మూడు వేల ఏళ్ల పైబడిన చరిత్ర ఉంది. పాండవుల కాలంలో ఇంద్రప్రస్ధంగా వెలిగిన మహానగరమే నేటి ఢిల్లీ ప్రాంతమని చరిత్ర కారులు చెపుతారు. మొఘల్‌ల కాలంలో షాజహాన్‌ చక్రవర్తి 1639 ప్రాంతంలో షాజహానాబాద్‌ పేరుతో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిం చాడు. ఆపై భారతా వనిని పాలించిన అనేకమంది చక్రవర్తులు,రాజులు, సరాజులు రాజధానిగా పాలిం చినా...ఒక్కోక్కరు ఒక్కోప్రాంతాన్ని తమకు అనుకూలంగాభావించి అనే క కోటలు, దర్బారులు ఏర్పాటు చేసు కోవటం తో ఎనిమిది రాజ్యాలు ఢిల్లీ చుట్టు పక్కల ఏర్ప డ్డాయి. అలా ఏర్పడ్డ రాజ్యాలలో సుందర ప్రాంతాన్ని గుర్తించిననాటి బ్రిటీష్‌ పాలకులకుడైన జార్జి చక్రవర్తి-5 తన పాలనా సౌల భ్యం కోసం కోల్‌ కత్తా లోనిపరిపాలనా యంత్రా గాన్ని ఢిల్లీకి తరలిం చాల ని తలచి...1911 డిశంబ ర్‌ 11న తన సతీమణి మేరీ కింగ్స్‌ క్యాంప్‌తో కల్సి ఢిల్లీ దర్బారు స్ధలంలో పునాది వేసి 7 నగరాల ను కలిపి న్యూఢిల్లీగా మార్చి అదే పాలనా కేంద్రంగా తన పాలనని సాగించారు. నాటి నుండి మరోమారు ఢిల్లీ రాజధా ని నగరంగా వెలు గొందింది. బ్రిటీష్‌ పాలకుల నుండి మనదేశానికి స్వాతంత్రం వచ్చినా అనేక భవనాలు పాలనకు సౌలభ్యంగా ఉండటంతో మన పాలకులు కూడా న్యూఢిల్లీనే రాజధానిగా చేసుకున్నా రు. ఇప్పటికి న్యూఢిల్లీ రాజధానిగా ఏర్పడి వందేళ్లు పూర్తి కావటంతో అక్కడ శత వార్షికోత్సవ సంబరా లను ఏడాది పాటు నిర్వహిస్తోంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం.

అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజధానిగా వెలుగొందుతున్న న్యూఢిల్లీ...చరిత్ర తరచి చూస్తే అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ శతాబ్ధ కాలంలో అనేక కొత్త పోకడలకు నాంది పలికిందనే చెప్పాలి. ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న నగరాలైన జహా నపాన, దినపానా, షేర్‌గఢ్‌, షా హజనానా బాద్‌, తుగ్గకాబాద్‌, సిరి ఇలా ఏడు నగరాలను న్యూఢిలీ ్లగా చేయాలని సంకల్పించిన నాటి నుండి పాండవుల కాలం నాటి ఇంద్ర ప్రస్ధ ప్రాంతంలో ున్న రైజినా గ్రామం వద్ద పాలనకోసం కావాల్సి న భవన నిర్మాణ పనులని ప్రారంభించారు. బ్రిటీష్‌ పాలకులు తమ పాలనాపట్ల ప్రజలకువినయ విదేయతలు కలిగేలా భవన నిర్మాణాలు ఉండాలని యోచించిన నాటి పాలకులు బ్రిటీష్‌ సామ్రాజ్య దర్పణం అందరికీ తెలియచేసేలా మహానగరాన్ని నిర్మించేందుకు ప్లాన్లు అనేక మంది ఆర్కిటెక్చర్లు రూపొందించారు. వీటిలో ఎడ్విన్‌ లాండ్‌ సీర్‌ లుటె న్స్‌, హెర్‌బెర్ట్‌ బాకెర్‌ అనే ఆర్కిటెక్చర్లు డిజైన్‌ చేసిన భవన ప్లానులకు జార్జి నుండి అనుమతి లభించ డంతో నాటి రాజరికపు ప్రతి బింబాలు గా నిలచే భవనాలు నిర్మాణం జరిగింది.నేడు ఢిల్లీలో కనిపించే రాష్ట్రపతి భవన్‌, సెక్రటేరియట్‌లు చూడవచ్చు.
ఆ క్రమంలో పాలనాయంత్రాంగం కోసం భవనాలు ఏర్పాటు చేసారు. 1922లో ఢిల్లీలో యూని వర్శిటీని ఏర్పాటు చేసినా భవన నిర్మాణాల విష యంలో పెద్దగా శ్రద్ద చూపక,తమ పారి పాలనకు అనువుగా వరుస భవనాలు నిర్మించు కుంటూ ... పోవటంతో ఆగ్రహం చెందిన విద్యార్ధులు, నాయ కులు పోరాటాలకు దిగాల్సి వచ్చిం ది కూడా. అయినా వెరవక కౌన్సిల్‌హౌజ్‌ నిర్మాణం పూర్తి చేసి ప్రారం భించడంతో అప్పటికే స్వాతంత్ర సమరంలో అనేక మంది త్యాగధనులు ప్రాణాలర్పించిన క్రమంలో వారి నుండి స్పూర్తి పొందిన భగత్‌సింగ్‌ లాంటి నేతలు దానిపె ౖకన్నేసి దానిని పేల్చేందుకు ప్రయత్నించారు. నాటి కౌన్సిల్‌ హౌజే నేడు మనకి పార్ల మెంట్‌గా మనం ఉపయోగిస్తున్నాం.
బ్రిటీష్‌ పాలకుల దాష్టికాలు రోజు రోజుకీ హెచ్చు మీరిపోతుండటంతో... విసిగి వేసారి న సామాన్య జనం కూడా బాపూ బాటలో నడిచి బ్రిటీష్‌ పాలకులకు తమ నిరసనల రుచి చూపించారు. ఊరూ వాడా ఏకమై...పల్లె పల్లె కదిలి... స్వాతంత్ర మహా సంగ్రామంలో పాల్గొనటంలో చివరికి ఎట్టకే లకు భారతావనికి దాస్య శృంఖలాలల నుండి విముక్తి చేస్తున్నట్లు ప్రక టించారు. దీంతో 1947 ఆగష్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం రాగా మన జాతీయ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై వెల్లివిరిసింది. అయితే ... నాటి దేశ విభజన సమయంలో పాక నుండి వచ్చిన వారిని తనలో చోటిచ్చిన ఢిల్లీని పాలకులు సరిగా పట్టించుకోక పోవటంతో ఇష్టౄను సారం గా నిర్మాణాలు పెరిగి పోయాయి. 1957లో ఏర్పడ్డ ఢిల్లీ డవలప్‌ మెంట్‌ అధారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌లు కలగల్సి రూపొందించిన మార్గదర్శకాలకు అను గుణంగా తిరిగి సుందర నగరంగా విస్తరణకు ప్రయత్నా లకు బీజం పడటంతో...నాటి ప్రధా ని నెహ్రూ సూచన లతో అనేక ఉద్యానవనాలు విశాలమైన రోడ్ల్లు నిర్మించారు.


విభిన్న సంస్కృతుల సమాహారం...

దేశ రాజధాని నగరంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు స్ధిరనివాసం ఏర్పాటు చేసుకోవటంతో నేడు ఢిల్లీ జనా భా రెండు కోట్ల 20 లక్షలు (2011 జనాభా లెక్కల ప్రకారం) వీరిలో అత్యధికు లు హిందువులే అయినా...
దాదాపు అన్ని మతాల ప్రజలు ఉండటంతో ప్రతి రోజు ఏ పండగ వాతావరణం కనిపిస్తుం ది. ఎవరు ఏ పండగ జరిపినా మిగిలిన మతాల వారు సైతం దానికి హాజరైతమ అను బం ధాలను చాటుకుంటారు. ఇక స్వాతంత్ర దినోత్స వం, గణతంత్ర వేడుకల్లో అయితే ఆ కోలాహలమే వేరు. నిత్యం కార్పోరేట్‌ కల్చర్‌ తో కళకళలాడుతూ ఉండే ఈ నగరం ఖరీదైన జీవనానికి ప్రతీకగా నిలుస్తు... నేటికీ తన దర్పాన్ని నిలబెట్టుకుంటూ ప్రపంచగుర్తింపు పొందుతోంది.




రాజరికం వెనక్కి...

బ్రిటీష్‌ రాజరిక స్మృతులు చెరిపి వేసే క్రమంలో అనేక మార్గాలకు మన భారత నాయకులు పేర్లు పెట్టారు. దీంతో యార్క్‌ రోడ్‌ వెూతీలాల్‌ నెహ్రూ మార్గ్‌గా... తీన్‌ మూర్తి మార్గ్‌ రాబర్ట్‌ రోడ్‌ గా, ఓల్‌ మిల్‌ రోడ్‌ని రఫీ మార్గ్‌గా, కింగ్స్‌ వేని జన్‌పథ్‌గా ఇలా పలు మార్పులుచోటుచేసుకున్నాయి
చూడాల్సినవీ
బోలెడు...

మూడు వేల సంవత్సరాలు రాజరికంలో ఉన్న ఢిల్లీ లో వారి నిర్మాణాలు , నాటి సాంప్ర
దాయాలు ఎక్కువగా కనిపిస్తాయి.ప్రస్తుతం పర్యాటకం గానూ అభివృద్ధి చెందిన ఢిల్లీలో చూడాల్సిన వాటిలో కన్నాట్‌ ప్లేస్‌, అక్షర్‌ధామ్‌, ప్రగతీమైదాన్‌లోని ఆటో ఎక్సపో, పార్లమెంట్‌, ఇండియాగేట్‌, ఎర్రకోట, జమా మసీదు, లెటస్‌టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపల్‌ విజరు చౌక, వెూఘల్‌గార్డెన్‌, రాజ్‌ఘాట్‌, బాపూఘాట్‌, సెక్రటేరియట్‌, పురానా ఖిల్లా, లకిë నారాయ ణ టెంపుల్‌, రాష్ట్రపతి భవన్‌,అక్షరధామం, జంతర్‌ మంతర్‌, కుతుభ్‌ మినార్‌, ఇలా చాలానే చూసేందుకు ఉన్నాయి.

ఏడాది పాటు కార్యక్రమాలు...

దేశ రాజధాని నగర గత వైభవాన్ని ప్రజలకు తెలియ చేసేలా ఢిల్లీ సర్కారు ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయిుంచింది. ఏడాది పాటు జరిగే ఉత్సవాలను భారత సాంస్కృతిక మండలి సారధ్యం లో జరగనున్నాయి. ఇప్పటికే దస్తన్‌ ఎ ఢిల్లీ పేరుతో ఢిల్లీ నగర గత చరిత్రను ఏర్పాటుకు దారి తీసిన పరిస్ధితిని వివరిస్తూ... ఢిల్లీ ప్రభుత్వం రూపొం దించిన పుస్తకాన్ని విడుదల చేసారు. దీనిలో నగర సంస్కృతి, వారసత్వ సంపదల వివరాలు తో పాటు అనేక ఛాయా చిత్రాలను ప్రజలకు వివరింస్తూ శతాబ్ధి ఉత్సవాలను ప్రజలలోకి చొచ్చుకు పోయేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రానున్న జనవరి నుండి ప్రారంభం కాన ున్న ఈ కార్యక్రమాల కోసం వందలాది కళాకారులు సిద్దమవుతున్నారు. ముఖ్య మంత్రి షీలా దీక్షిత్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తేజేంద్ర ఖన్నా... ఈ శతాబ్ధి ఉత్సవాలనుఎప్పటికపðడు పర్యవే క్షించేందుకు సిద్దమయ్యారు.
ఎవరెన్ని అవాంతరాలు చేస్తున్నా... పరమత చిహ్నానికి ప్రతీకగా నిలుస్తూ ... ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజధాని నగరం నిత్యం అనేక మందితో తెగ సందడి సందడి గా ఉంటుంది... ఇలాంటి నగరాన్ని ఒక్కసారైనా వీక్షించాలని అంద రి కీ ఉంటుంది.ఈ సారి సెలవుల్లో ఢిల్లీ వెళ్లి మీ వారందరితో అక్కడి ప్రద ేశా లు, నాటి మన చరిత్ర, సంప్రదాయాలను చూసి ఆనందంగా గడిపి రండి.. అదీ శతాబ్ధి ఉత్సవాలు ముగిసేలోగా అయితే మరీ మంచిది... ఇపðడైతే బోలుడు విషయా లు తెలుస్తాయి.

బాంబుల పేలుళ్లతో తల్లఃఢిల్లీః
మన దేశానికి స్వాతంత్ర వచ్చిన నాటి నుండి ఢిల్లీయే రాజధానిగా వెలుగొందు తున్నా.. పరమత సహనానికి ప్రతీకగా నిలు స్తున్నా... ముష్కరుల కళ్లనీ రాజధానీ మీదే ఉన్నాయి. గత రెండు దశాబ్ధాలలో 20కి పైగా పేలుళ్లు జరిపినా నిలదొక్కుకు వస్తోం ది...ఒక్క 1997లో వరుసగా ఏడ సార్లు పేలుళ్లు జరపారంటే మన భారతా వనిపై ఉగ్రవాదులు ఎంత గురిపెట్టారో అర్ధం చేసు కోవచ్చు. నేటికీ ఎక్కడో ఓచోట బాంబు పెట్టామంటూ బెదిరింపులకు దిగుతున్న సంద ర్భాలు అనేకం మనం చూడోచ్చు. ఇక గత 20 ఏళ్లలో జరిగిన పేలుళ్ల సంఘ టనల్ని అవలోకన చేసుకుంటే...
1993 మార్చి 12న పేలుళ్లలో 257 మంది మృత్యువాత పడ్డారు.
1997 జనవరి 9న ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద పేలుళ్లు.
అక్టోబర్‌1న సర్ధార్‌బజార్‌లో పేలుళ్ళు
అక్టోబర్‌10న కౌరియా పూల్‌, కింగ్స్‌ వే క్యాం ప్‌, శాంతివనాలలో పేలుళ్లు10మంది మృతి.
అక్టోబర్‌ 10 రాణీ బాగ్‌లో ,,
నవంబర్‌ 30 ఎర్రకోట వద్ద జంట పేలుళ్లు.
డిశంబర్‌ 30న పంజాబీబాగ్‌లో బస్సు పేల్చివేత.
1998 జూలై 26న కాశ్మీరీ గేట్‌ వద్ద అంతర్జా తీయ బస్సు పేలుడు.
2000 జూన్‌ 18 ఎర్ర కోట వద్ద పేలుడు.
2001 అక్టోబర్‌ 1న పేలుళ్లలో 35 మంది మృత్యువాత పడ్డారు.
డిశంబర్‌ 13న పార్లమెంట్‌పై దాడి 5 గన్‌మాన్‌లతో సహా 12 మంది మృతి.
2005 మే 22 సినిమా హాళ్లలో పేలుళ్లు.
అక్టోబర్‌లో ఢిల్లీమార్కెట్‌లో పేలుడు 62 మంది మృత్యువాత.
2006 ఏప్రియల్‌ 14న జామా మసీద్‌ ప్రాంగ ణంలో బాంబు పేలుళ్లు..
2008 సెప్టెంబర్‌ 13న వరుస పేలుళ్లు.. 25 మంది చనిపోయారు.
ఏప్రియల్‌ 26 మొహ్రౌలీ ఫ్లవర్‌ మార్కెట్‌లో బాంబు పేలుడు.
ఏప్రియల్‌ 27 వెూహ్రౌలీ మార్కెట్‌లోపేలుడు.
2001 మే25న హైకోర్టు పార్కింగ్‌లో పేలుడు
2011 సెప్టెంబర్‌ 2న జరిగిన బాంబు పేలుళ్లలో 9 మంది చనిపోగా 45 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.