16, డిసెంబర్ 2011, శుక్రవారం

మారియో! భళారే వి'చిత్రాలు'

రేఖాచిత్రాల నిలయంగా మార్చేసి... తన చెరగని చిరునామాగా తీర్చిదిద్దిన
మారియో... కళాభిమానుల హృదయ ఫలకాలపై చిరంజీవే ఎన్నటికీ....
మారియో మిరాండా కార్టూన్‌ చూస్తే గోవా వెళ్లినట్లే. అని గోవాని సందర్శించనివాని నుద్ధేశించి ఈ మాటలన్నది ఎవరో కాదు. గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌. ?
భారతదేశంలో కార్టూనీdస్టులలో ప్రముఖులు మారియో. వారు క్రైస్తవులైనా, వారి కోరిక మేరకు హిందూ స్మశాన వాటికలో సోమ వారంనాడు అంత్యక్రియలు జరిగాయంటే ఆయనలోని పరమత సహనం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
మారియో కార్టూన్లు సహజత్వానికి ప్రతీకలు. బొమ్మలో నీడలు తీసుకురావటం వారికే సాటి అన్నంతగా ప్రఖ్యాతి చెందారాయన. ప్రఖ్యాత ఆంగ్ల వార పత్రిక ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో కథలకు వేసిన బొమ్మలు చాలా ఆకర్షణీయంగా వుండేవి. పద విన్యాసాల కార్టూన్లు నిత్య నూతనత్వ హాస్యంతో అలరా రేవి. --

ఎసnd, ఈుషnషసాపn, nd ప ాుషస ాశసలో 'ౄశస' వాడ టం :ుషఠస షుnగష బదులు :షసdస షుnగషతో చురకలు వేసేవారు. మారియో పూర్తి పేరు మారియో జోవో కార్లోస్‌డో రోసారియో డె బ్రిట్టోమిరాండా, కార్టూన్లు పిన్న వయసులోనే ప్రారంభించిన ఆయన ముంబైలో డిగ్రీ చదివాక... తన కిష్టమైన ఆర్కిటెక్ట్‌ కోర్సులో చేరారు.
కార్టూనిస్ట్‌గా....

మారియో 1953లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో కార్టూనిస్ట్‌గా చేరి పనిచేస్తూనే... తదుపరి ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో పనిచేసారు. 1960 తర్వాత లండన్‌లో ప్రముఖ పత్రికల్లో చేరి... ఆయన గీసిన కార్టూన్లు అన్ని దేశాల వారి అభిమానాన్ని చూడగొ న్నాయి. 22 దేశాలలో ఆయన కార్టున్లు, చిత్ర ప్రదర్శన జరిగింది. అమెరికా, జపాన్‌, బ్రెజిల్‌, ఆల్ట్రేలియా, ఫ్రాన్స్‌, సింగపూర్‌, యుగోస్లోవియా, పోర్చుగల్‌లో వారి కార్టూన్లు ప్రజాదరణ పొందాయి.
మారియో, విదేశాల నుండి తిరిగి వచ్చాక ఎకనామిక్‌ టైమ్స్‌లో చేరారు. ప్రముఖ వ్యాపార సంస్థల క్యాలెండర్లకు చిత్రాలు వేశారు. వారు వేసిన చిత్రాలలో 'మిస్‌ నింబు పాని', మిస్‌ ఫోన్సెకా ప్రాచుర్యం పొందాయి.
బిరుదులు...

భారత ప్రభుత్వం మారియో ను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మ భూషణ్‌ బిరుదులతో సత్కరించింది. డబ్బు కోసం ఎప్పుడూ వెంప ర్లాడని ఆయన చిత్రాలను కళగానే భావించేవారు...గోవాలోనిలౌటోవిమ్‌లోని ఇంటి ని తనఅభిరుచికి తగ్గట్టు అభీష్టం మేరకే నిర్మిం చు ున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం. చెట్లు, చేమలు, అనేక రకరకాల పక్షులు, జంతువులతో, సందర్శకుల దర్శనంతో ఎప్పుడూ కోలా హలం గా వుంటుంది. ఇక గోడలవైపు దృష్టి సారిస్తే, పేపర్‌ సైజుకంటే పెద్దగా కార్టూన్లతో అందరినీ అలరిస్తాయిదేశ విదేశాల నుండి సంద ర్శకులు వారి ఇంటిని చూడటానికి బారులు తీరుతారు.
దూరదృష్టిమెండు

మారియోకు దూరదృష్టిమెండు. ఒకసారి ముంబై రేడియోలో మోరార్జీదేశాయ్‌ ప్రధాని పదవిని చేపట్టనున్నారని వార్త రావడంతో, మిరాండా వెంటనే మొరాజ్జీ దేశాయ్‌, మద్యపాన నిషేధంపై కార్టూను వేశారు. మొరార్జీ దేశం కేవలం-10 నిమి షాలలోనే మద్యపానాన్ని నిషేధిం చారు.
ఇలస్ట్రేటెడ్‌ వీక్లీలో ఆయన కార్టూన్‌ చూసి కానీ, మిగతావి చూసే వారు కాదు. ఆయ న రేఖా చిత్రాలు జనం హుృద యా లను దోచుకునేవి. ముఖ్యంగా నిత్యం జరిగే సం ఘటన లతో, ఆమ్‌ ఆద్మీని తలపించేవి.
ఆయన చిత్రాలు చూడంగానే, తక్కువ పదాలతో, ఎక్కువ అర్థాన్ని ఇనుమడిం చేవారు. ధరల పెరుగుదల, అవినీతి, లంచగొండి తనం, కప్పల తక్కెడ రాజకీ యాలు, ఇలా ఒకటేమిటి? అన్ని కోణా లపై వారు చిత్రాలను వేసేవారు.
మారియో చిత్రాలు గోవాను ప్రతి బింబించేవి. ఇతర రాష్ట్రాలవారికి, వారు గోవాను పరిచయం చేసారనే చెప్పాలి. వారి కార్టూన్లు నిత్యం కొం గ్రొత్తగా వుండి అలరించేవి.
ఏదో ఒక గీతతో సంతృప్తిపడేవారు కాదాయన.. ముఖ్యంగా ఆఫీస్‌ బాస్‌, సెక్రటరీ, మధ్యతరగతి ఇళ్లలోని సంసారంలో సరిగమలు ఇలా ఎన్నో వైవిధ్య భరిత చిత్రాలు గీసి అందరినీ అలరించేవారు.

సర్వమత సమానత్వం...
తన 85వ ఏట నిద్రలో కన్ను మూసిన మారియో భార్య హబీబా చక్కటి ఉర్దూ మాట్లాడు తుంది. వారు జన్మత: క్రైస్తవులు. భార్యకు ముస్లిం సంప్ర దాయ ప్రభా


వం ఉండగా... ఆతని కుమారులు రఫద్‌, రావుల్‌పై హిందూ సంప్రదాయం ఆచరించేవారు. మారియో మరణానంతరం అంతిమదర్శనానికి వారి స్వగ్రామం లౌటోలి మ్‌లోని వరల్డ్‌ చర్చిలో వుంచారు. ఐరిష్‌, పోర్చుగీస్‌ పాటలను ఆలా పన చేశారు. వారి అంతిమ యాత్రలో సందర్శకు ల కళ్లు తడి ఆరలేదని ఓ ప్రముఖ రచయిత వ్యాఖ్యానిం చారు.
వివిధ రంగాల ప్రముఖులు పద్మశ్రీ మారియా ఆరోరా, సంగీత విద్వాంసుడు రెయోఫెర్నాండెజ్‌, ఆర్టిస్ట్‌, హెరిటేజ్‌ లవర్‌ విక్టర్‌ హ్యూగో గోమ్స్‌, కార్టూనిస్ట్‌ అలెగ్జ్‌, పారిశ్రామిక వేత్తలు దత్తరాజ్‌, శ్రీనివాస్‌ డెంపో, జడ్జి డి.సిల్వా ఫెర్డ్‌ నాండ్‌ రెబెల్లో, ప్రముఖ రచయిత విక్టర్‌, తదితరు లున్నారు.
ప్రముఖ కార్టూనిస్టులకు, రచయితలకు చావులేదు. వారు ఎప్పుడూ జీవిస్తూ వుంటారు. వారి రేఖలకు లక్ష్మణరేఖలు లేవు. అవి హద్దుల ను చెరిపేస్తాయి. లౌటోలియంలోని మారియో ఇల్లే దేవాలయం, అదే చిత్రాలయం, మూగజీవాలకు నిలయం, సందర్శకులకు చెరిగి పోని చిరునామా, అదే మారియో మిరాండా! తనువు వీడినా ఎందరో చిత్రాభి మానుల హుృదయాలలో తనకంటూ ఓ చోటు చేసుకున్నారు.
- దండు కృష్ణవర్మ