17, సెప్టెంబర్ 2012, సోమవారం

నాలో..నేను.. సెన్సార్ కట్స్

పి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో మదన్‌ బి.జె. నిర్మించిన 'నాలో..నేను..' చిత్రంలో సంపత్‌రాజ్‌, రోహిత్‌, శ్రీ, చెన్నకేశవరెడ్డి, నిర్మల, శ్రీలక్ష్మి ముఖ్యపాత్రధారులు.
ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' 29-2-12న 5 కట్స్‌తో 'ఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
1. సినిమాలో 'బాస్టర్డ్‌, నీ యబ్బ, నా కొడకా, నాయాలా' పదాలు ఎక్కడున్నా తొలగింపుకు గురి అయ్యాయి.
2. పబ్లిసిటీ పోస్టర్‌ని తొలగించమనగా తీసివేసారు.
3. సినిమాలో ధుమపానం, మద్యపానం సీన్లు ఎక్కడ వచ్చినా హెచ్చరికను ప్రదర్శించమన్నారు.
4. సినిమాలో 3 నుంచి 12వ రీలు వరకు గల ప్రేమ (రేపింగ్‌)కి సంబంధించిన దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమనగా, ఆ షాట్స్‌ తీసి అంగీకరించిన అంతే నిడివిగల వేరే దృశ్యాలను ఉంచారు.
5. ''వాళ్లకి ఒక్కటే నాకు రెండు ముంతలు'' అనే డైలాగ్‌ కత్తెర పాలైంది.
2గం||15 ని||ల సేపు ప్రదర్శితమయ్యే ఈ చిత్రం 22-8-12న విడుదలైంది.