22, సెప్టెంబర్ 2012, శనివారం

'మేడ్‌ ఇన్‌ ఇండియా'

ఆర్థిక ప్రగతి పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు మారిందనడానికి సూచిక ఇది. ఆసియా దిగ్గజాలైన భారత్‌, చైనాలలో తయారైన వస్తువులకు పశ్చిమ దేశాల్లో క్రేజ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఫార్చ్యూన్‌ మేగజైన్‌ చేసిన సర్వేలో ఈ విషయం స్పస్టమైంది. అందులోనూ భారత్‌ వస్తువులకు మరింత గిరాకీ పెరిగింది.
'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఉత్పత్తులకు అమెరికాలో గిరాకీ బాగానే ఉందని ఒక సర్వేలో వెల్లడైంది. అదే విధంగా, మేడ్‌ ఇన్‌ చైనా ఉత్పత్తుల పట్ల వినియో గదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని తేలింది. అమెరికాకు చెందిన ఫార్చ్యూన్‌ మేగజైన్‌ ఈ విశేషా లను వెల్లడించింది. ఈ వస్తువుల్లో ఆట వస్తువులు కూడా ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆట వసు ్తవుల కంపెనీ మట్టెల్‌ చైనా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటుండగా, వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. 57 శాతం మంది అమెరి కన్లను మేగజైన్‌ సంప్రతించగా, అయిదుగురిలో ముగ్గురు చైనా ఉత్పత్తుల పట్ల ఆంతగా ఆసక్తిని వ్యక్తపరచలేదు. అయితే, సర్వే జరిపిన వారిలో 52 శాతం మంది 'మేడ్‌ ఇన్‌ ఇండియా' ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత చూపలేదని మేగజైన్‌ పేర్కొంది. మొ త్తం అమెరికన్లలో 35 శాతం మంది భారతీయ వస్తువుల పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదని, 11 శాతం మంది అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారని వివరించింది. అదేవిధంగా చైనా వస్తువుల పట్ల 11 శాతం మంది కొద్దిగా ఆసక్తి చూపుతుండగా, 30 శాతం మంది అసలు పట్టిం చుకోవడం లేదని పేర్కొంది. గత నెలలో జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా బయటపడ్డాయి. ఆయా వస్తువులు అసలు ఏ దేశంలో తయారవుతున్నదీ అమెరికన్లు పట్టించు కోవడం లేదని, అయితే, చైనా వస్తువలు అయితే మాత్రం జాగ్రత్త పడుతున్నారని తేలింది. తూర్పు ఐరోపాలో తయారైన వస్తువులను 57 శాతం మంది, పశ్చిమ ఐరోపా వస్తువులను 55 శాతం మంది, కెనడా ఉత్పత్తులను 53 శాతం మంది, భా రత ఉత్పత్తులను 52 శాతం మంది, ఆఫ్రికా ఉత్పత్తులను 51 శాతం మంది, మెక్సికో ఉత్పత్తులను 48 శాతం మంది, జపాన్‌ ఉత్పత్తులను 47 శాతం మంది, దక్షిణ కొరియా ఉత్పత్తులను 46 శాతం మంది అమెరికన్లు ఇష్టపడుతున్నారు.