5, అక్టోబర్ 2012, శుక్రవారం

పన్నులు లేని భారతదేశం

అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని కర్ణాటక లోకాయుక్త మాజీ జస్టిస్ సంతోష్ హెగ్డే పేర్కొన్నారు. స్వాతంత్య్రం సాధించిన 65 ఏళ్లలో దేశంలో 74 కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ప్రతి కుంభకోణం ఒక రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగానే ఉందన్నారు. స్విస్ బ్యాంక్‌లో దాచిన కోటి నాలుగులక్షల బిలియన్ల అమెరికన్ డాలర్లను భారతదేశానికి తిరిగి తీసుకురాగలిగితే 24 గంటల్లో దేశానికి ఉన్న అప్పును తీర్చేయచ్చన్నారు. పన్నులు లేని భారతదేశంగా తీర్చి దిద్దొచ్చన్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో రూ. 70వేల కోట్ల మేర అవినీతి జరిగితే ప్రశ్నించేవారే లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేట్‌వైపు వెళ్లే విధంగా నాయకులే ప్రోత్సహిస్తున్నారన్నారు. అన్నా హజారే బృందం అవినీతిని నిర్మూలించలేకపోయినా అవినీతి గురించి ప్రశ్నించే ఒక వేదికను అందించిందన్నారు.