16, ఏప్రిల్ 2018, సోమవారం

భారత్‌లో 165 ఏళ్ల కిత్రం ఈ రోజు జరిగిన అద్భుతం....

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే టాప్- 5 నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరొందింది. సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ ఇది. కాగా మన దేశంలో 1853 ఏప్రిల్ 16న తొలి రైలు నడిచింది. ఇది 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ రైలు బోరీబందర్ (ఛత్రపతి శివాజీ టర్మినల్-ముంబై) నుంచి ఠాణే మధ్య నడిచింది. బ్రిటన్‌లో రూపొందిన ఈ రైలులో మొత్తం 20 బోగీలున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బయలు దేరిన ఈ రైలు 4.45కు గమ్యస్థానం చేరింది. 1845లో కోల్‌కతాలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్ కంపెనీ ఏర్పడింది. 1850లో ఈ కంపెనీ ముంబై నుంచి ఠాణె వరకూ రైల్వే లైన్ పనులను చేపట్టింది.