16, ఏప్రిల్ 2018, సోమవారం

భారత్‌మాల నుంచి ఆంధ్రా అవుట్‌...

భారత్‌మాల నుంచి ఆంధ్రా అవుట్‌...
భారీ తీర‌ప్రాత‌మున్నద‌క్షిణాదిని కాద‌ని. ఉత్తరాదికే పెద్దపీట
కేంద్ర ప్ర‌భుత్వ మ‌రో క‌క్ష‌సాధింపు
రహదారుల నిర్మాణంతో దేశానికి మణిమాలను తయారు చేయాలనుకున్న భారత్‌మాల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలు.. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దఎత్తున ప్రా జెక్టులు ఇచ్చి నవ్యాంధ్యకు చిల్లర పడేసినట్లుగా విదిల్చారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన భారత్‌మాల ప్రాజెక్టుల్లోని గణాంకాల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌తో భారత్‌మాలను నింపేశారు. ఆర్థికాభివృద్ధి కారిడార్‌, ఫీడర్‌, ఇంటర్‌ కనెక్టివిటీ, ఎక్స్‌ప్రెస్‌ వేల జాబితాలో ఏపీ రాష్ట్రం దాదాపు మాయమైంది. తీరప్రాంత రహదారుల్లో.. అదీ విదేశీ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల కింద రెండే రెండు ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు చోటుకల్పించలేదు.