28, అక్టోబర్ 2010, గురువారం

మిగిలిన సలహాదారులు ఏం చేస్తారు?


ప్రభుత్వానికి సలహాదారులుగా 6 గురువ్యవహరిస్తున్నా... ఒకరిద్దరు తప్ప మిగిలినవారు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు కూడా ఏమీ లేవని, వారివల్ల ప్రయోజనం ఏమీ లేదన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి.

ఈ నేపద్యంలో సీఎం కార్యాలయంలో పని చేస్తున్నా.... తనంతట తానుగా చొరవ తీసుకొని పని చేయాల్సి వస్తోందని . తనకు ఏ శాఖా కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, సీఎంవోలోని ఇతర అధికారులు కూడా తన ప్రమేయాన్ని అంగీకరించడం లేదన్న అసంతృప్తి తో ఉన్న ముఖ్యమంత్రి రోశయ్య వ్యక్తిగత సలహాదారు మాజీ ఐఏఎస్ అధికారి పీకే అగర్వాల్ ఆ పదవి నుంచి తప్పుకొన్నారు

భద్రతా వ్యవహారాల సలహాదారుగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆర్థిక సలహాదారుగా సోమయాజులు, ఐటీ సలహాదారుగా సీఎస్ రావు, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, పెట్టుబడులకు కేంద్రంలో సలహాదారుగా పీటర్ హసన్, విదేశీ పెట్టుబడులకు సంబంధించిపోస్ట్‌ను ప్రచురించున సలహాదారుగా సీసీ రెడ్డి వ్యవహరిస్తున్నా . ముఖ్యమంత్రికి పనికొచ్చే సలహాలు, సూచనలను ఆయన ఏమీ ఇవ్వలేక పోయరన్నది వాస్తవం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా అగర్వాల్ పని చేసినప్పుడే ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన జరిగింది. కొంతకాలం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎండీగా వ్యవహరించారు..తాజాగా అగర్వాల్ సలహాదారు పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలినవారు ఏం చేస్తారు!? వారి విషయంలో ప్రభు త్వ వైఖరి ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.