29, అక్టోబర్ 2010, శుక్రవారం

కాంగ్రెస్ కి ఒకటి విద్రోహ దినమా? ఎలా? అవుతుంది

రాష్ట్ర ఆవిర్భావం విద్రోహ దినం ఎలా అవుతుందని, విశాలాంధ్ర కావాలని అప్పుడు పార్లమెంటులో అడిగింది.. శాసనసభలో తీర్మానం చేసింది ఈ నాయకులు కాదా అని పీఆర్పీ అధికార ప్రతినిధి వాసిరెడ్డ పద్మ ప్రశ్నించారు. నాయకులు, తరాలు మారగానే అభిప్రాయాలూ మారతాయా అన్నారు.

అంశాల్లో అన్యాయం జరిగితే దాన్ని గురించి మాట్లాడాలి కానీ.. విద్రోహం అనడం సరికాదన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్రోహదినం అనే హక్కు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల తీర్మానం ఆ పార్టీనే చేసిందని గుర్తు చేశారు. అర్చకుల సమస్యలపు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు