7, నవంబర్ 2010, ఆదివారం

అయన నిజాం వారసుడే కాదు

నిజాం వారసుడిగా చెప్పుకుంటున్న ప్రిన్స్ ముకరంజా అసలు నిజాం వారసుడే కాదని ... చారిత్రిక కట్టడమైన ఫలక్ నుమా ప్యాలేస్‌తోపాటు నిజాం కట్టడాలన్నింటినీ జాతికి అంకితం చేయాలని మాజీ కేంద్రమంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజ్ ఫలక్ నుమాగా పేరుమారుస్తూ ఖరీదైన హోటల్‌గా ప్రారంభించడాన్ని ఆయన హెచ్చరించారు. మన సంస్కృతికి, చరిత్రకు చిహ్నంగా ఉన్న ఫ లక్‌నుమా, చిరాన్ ప్యాలేస్‌లు, కింగ్ కోఠి లాంటి నిజాం కట్టడాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలni ముఖ్యమంత్రి రో శయ్యకు లేఖ రాశానన్నారు.