9, నవంబర్ 2010, మంగళవారం

విధులకుడుమ్మా కొట్టే వైద్యులు పై ప్రభుత్వం కొరడా

వైద్యులుగా కొలువు చేస్తూ విధులకుడుమ్మా కొట్టే వారిపై ప్రభుత్వం కొరడాఝళిపించింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాల మేరకు వైద్యులు విధిగా ప్రతిరోజు ఉదయంతొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగుగంటల వరకు ఆస్పత్రిలో ఉండాలి. ఏడాదికి మించిఅన ధికారికంగా విధులకు డుమ్మా కొడితే విధులనుంచి తొలగించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏడాది కన్నా తక్కువగా విధులకు గైర్హాజరైతే భారీజరిమానా విధించడంతోపాటు శాఖ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.