24, జనవరి 2011, సోమవారం

ఆ నిధులన్నీ "రచ్చ బండ"కి తరలించండి

ఆర్థిక సంవత్సరంలో 3 నెలల కింద విడుదల చేసిన నిధుల్లో ఎలాంటి బిల్లులు చెల్లించరాదని ప్రభుత్వం ఖజానాపై ఆంక్షలు విధించింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు, రచ్చబండలో చెల్లించాల్సిన వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చినా.. ఇదే సమయంలో వివిధ శాఖలకు విడుదల చేసిన నిధులకు సంబంధించి ఎలాంటి బిల్లులు మంజూరు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
అద్దెభవనాల చెల్లింపులు, కార్యాలయం ఖర్చులు, ప్రభుత్వ వాహనా ల మరమ్మతుల బిల్లులు, పెట్రోల్ బిల్లులు, అద్దె వాహనాల బాడుగలు, కార్యాలయాల విద్యుత్, నీటి బిల్లులు ఇతర ఖర్చులపై ఆంక్షలు విధించడంతో పాటు ఎలాం టివి చెల్లించరాదని ఆదేశాలు జారీ చేయటంతో ఆ నిధులన్నీరచ్చబండకు తరలిచడంలో రానున్న రోజుల్లో జనాలకే కాదు, ఆదికారులకీ ఇబ్బందులు తప్పెట్లు లేవు.