24, జనవరి 2011, సోమవారం

సోనియాగాంధీకి జేఏసీ పిండప్రదానం

తెలంగాణా జేఏసీ ఆద్వర్యంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి పిండప్రదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి పెద్దేత్తున తెరాస నేతలు, కార్య కర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 600 మంది ప్రాణాలు కోల్పోయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకపోవడం బాధకరమ ని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా సీమాంధ్ర నాయకులకు వంత పాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టకుండా తాత్సారం చేస్తున్న సోనియాగాంధీకి పిండప్రదానం చేశామన్నారు.