6, ఏప్రిల్ 2011, బుధవారం

చెన్నైలో ‘పీపుల్ ఫర్ జగన్’ కి శ్రీకారం

తమిళనాడులోని వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులను ఏకం చేసేందుకు జగన్ యూత్ ఫోర్స్ నేతృత్వంలో ‘పీపుల్ ఫర్ జగన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా యువత హాజరయ్యారు. తమిళనాడులో ఉన్న అపారమైన యువశక్తిని, తెలుగు వారిని ఒక గొడుగు కిందికి తీసుకురావచ్చ ని, జగన్ స్ఫూర్తితో నవ సమాజ నిర్మించాలని, ప్రజలను భాగస్వామ్యం చేసి సేవా కార్యక్రమాల్ని విస్తృత పరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి తెలిపారు. తన వంతుగా తమిళనాడులోని యువశక్తిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.