6, ఏప్రిల్ 2011, బుధవారం

అన్నా హజారేకు మేథా మద్దతు

అన్నా హజారే చేపట్టిన నిరాహారదీక్షకు ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ తన మద్దతును ప్రకటించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి వెంటనే జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ చొరవ తీసుకోవాలన్నారు.