7, ఏప్రిల్ 2011, గురువారం

రానున్న రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే

రానున్న రోజులు జగన్ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవేనని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. అధికార కాంగ్రెస్, ఇతర పార్టీలతో ప్రజలు విసిగి పోయార ని . కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రతి పక్షాల చేతకాని తనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని దీంతో రాష్ట్ర ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చూస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టిన పథకాలు సక్రమంగా అమలు కావాలంటే తమ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమన్నారు.