7, ఏప్రిల్ 2011, గురువారం

ధర్మాన కుటుంబంలో జగన్ చిచ్చు

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి తన కుటుంబమంతా కృషి చేస్తుందని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. తాను తన సోదరులకు, కుటుంబానికి దూరమవుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుందని.తన సోదరుడు ధర్మాన ప్రసాద రావు మంత్రి గా కాంగ్రెస్స్ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన తాను  రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయకూడదని లేదు కదా అని ఎదురు ప్రశ్నించారు. 
సోనియా తన కుటుంబంలో చిచు పెట్టిందని చేప్తున్న జగన్ ధర్మాన కుటుంబంలోనూ అదేపని చేశాడంటూ వస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.  తామంతా ఐకమత్యంగానే ఉన్నామని, ఉంటామని ..రాజకీయంగా ఎవరి మార్గం వారు ఎంచుకున్నంత మాత్రాన ఈ విధమైన ప్రచారాలు చేయడం కొంతమందికి తగదన్నారు.. రాజకీయాలు మధ్యలో వచ్చాయని, రాజకీయాల కంటే ముందు రక్త సంబంధం, అనుబంధం ఉన్న విషయాన్ని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు..ప్రస్తుతం తానూ కాంగ్రెస్లో ఉన్నా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరి పార్టీ అభివృద్ధికి దోహద పడాలంటూ తనకు తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయని, జిల్లా నలుమూలల నుంచి నాయకులు వచ్చి స్వాగతిస్తున్నట్లు కృష్ణదాస్ చెప్పారు.