12, మే 2011, గురువారం

జూన్ 1 నుంచి ఉద్యమం ఉధృతం

రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూన్ 1 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ స్వామి గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. . ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 177 తెలంగాణ ఉద్యోగుల గొంతు నొక్కేదేనని ఆయన అభిప్రాయపడ్డారు. జీవో ఉపసంహరణకు ముఖ్యమంత్రి అంగీకరించి, నెలన్నర కావస్తున్నా.. సంబంధిత ప్రక్రియ పూర్తి కాలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు