12, మే 2011, గురువారం

అంజిత ఐపీఎస్

నిర్మల్ పట్టణంకు చెందిన చెప్యాల అంజిత ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. ఆమె 2007లో సివిల్స్ రాశారు. 1500 మార్కులకు 1217 సాధించారు. ఓబీసీలకు రిజర్వేషన్ శాతం పెంచడంతో ఓసీలకు అన్యాయం జరుగుతోందంటూ 90 మంది అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి ర్యాంకును బట్టి సర్వీస్‌లోకి తీసుకోవాలని గతనెల 26న కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అంజిత ఢిల్లీ-అండమాన్ నికోబార్ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.