12, మే 2011, గురువారం

జయప్రదకు ‘లలిత కళా నటనా మయూరి’ బిరుదు

రాజ మండ్రిలో విరిసిన మల్లిక లాంటి సినీ నటి జయప్రద జాతీయ స్థాయికి ఎదిగి రెండుసార్లు ఎంపీ కావడం ఈ ప్రాంతానికే గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి ప్రశంసించారు. జయప్రదకు ‘లలిత కళా నటనా మయూరి’ బిరుదునిచ్చి సత్కరించారు. ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, ఆలీ, ఊర్వశి శారద, వాణిశ్రీ, కొండవలస లక్ష్మణరావు, కథానాయికలు నికిషా పటేల్, కామ్నా జఠ్మలానీ, సలోనీ, సినీ నటులు హేమ, కవిత పాల్గొన్నారు. హాస్యనటులు తమ చతురోక్తులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.