12, మే 2011, గురువారం

గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు రాజీనామా

గిద్దలూరు ఎమ్మెల్యే(పీఆర్‌పీ) అన్నా రాంబాబు శాసన సభ్యత్వానికి బుధవారం ఉదయం రాజీనామా చేశారు. జలయజ్ఞం ముందుకు సాగటం లేదని, రెండేళ్లుగా తాను చేస్తానన్న పనులు ప్రజలకు చేయలేక పోయాననే ఆవేదనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారాన్ని ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అవలంబించిందని, వెలగలపాయ ప్రాంతం వారికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనట్లు తెలిసింది.