11, డిసెంబర్ 2011, ఆదివారం

ఆర్య, ద్రావిడుల సహజీవనం

ప్రాచీన భారతదేశచరిత్ర అంటే ఋగ్వేదం, సింధు నాగరికత, ఆర్యులదాడి, ద్రావిడులను దక్షిణాదికి తరిమి వయడం ఇవే ప్రధానాంశాలు కావనీ, ఋగ్వేద ఆర్యులు సింధునగరాల వాసులైన ప్రజలు సహజీవనం చేసారనీ వారితోపాటు పూర్వ ద్రావిడులు, ద్రావిడభాషా కుటుంబీ కులు కూడా కలిసి జీవించారనీ, వీరంతా ఒకరి వలన మరొకరు ప్రభావితులైనారని నిరూపించే అనేక అంశాలు వెలుగులోకి రావడంతో ఈ పరిశోధనలు క్రొత్త పుంతలు తొక్కసాగాయి అన్నారు పూర్ణచంద్‌.
అంతేగాక 'భారతదేశంలో ఆస్ట్రిక్‌ భాషా కుటుంబం ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబం ద్రావిడ భాషా కుటుంబం మంగోలాయిడ్‌ భాషా కుటుంబం సమాహారంగా వుంటుంది. ఇక్కడి భాషలు నాగరికత, సంస్కృతుల ప్రభా వంలోనే ఋగ్వేద సంకలనం జరిగింది. ఋగ్వేద ఆర్యులు, వారికన్నా పూర్వీకులైన ముండా ప్రజలు పూర్వ ద్రావిడులైన ప్రజలతో సహజీవనం చేసారు. చరిత్ర కారులలో ఆర్యులదాడి జరిగిందనేవారు, జరగలేదనే వారు. ఇలా రెండు వర్గాలు వున్నాయి. జిమ్‌షాఫర్‌, టైనీ లిక్టెన్‌స్టీన్‌ (1999) అనే ఆర్కియాలజిస్టులు ఆర్యులదాడి అనేది జరగలేదని స్పష్టంగా పేర్కొన్నారు. 'ఆర్యన్‌ ఇనేవేజన్‌ థియరీలోని ఆర్యుల జన్మభూమి భారత దేశం కాదని, ఇండో యూరోపియన్‌ భాషా కుటుం బం కూడా భారతదేశంది కాదని బయట నుంచే వచ్చాయని నిరూపించడమే కొందరి లక్ష్యంకాగా వీరిలో ఆర్యులు ఆగంతకులుగా వచ్చారు. ఆర్యులు ఆశ్రితులుగా వచ్చారు అనే రెండు వర్గాల వాదనలు చేసే వారు ఉన్నారు. ఇందుకు భిన్నంగా ఆర్యులు ఇక్కడి వారేనని చెప్పాలని మేము అనుకుంటున్నా. ''ఈ రెండు సిద్ధాంతాలు రైలు పట్టాలాంటివి. ఏనాటికీ కలవలేవు. చరిత్రకు రాజకీయాల రంగు పులమటమే ఇక్కడ విచా రకరం అంటారు పూర్ణచంద్‌.
దక్షిణాసియా దేశాల మధ్య అనాదిగా నడిచిన పరస్పర సంబంధ బాంధవ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి లోనే కొనసాగాయి కాబట్టి మూల ద్రావిడులు వైదిక ఆర్యులు సమకాలీనంగా కలిసిమెలిసి జీవించారన్నదే ముఖ్యమైన విషయం అంటారు పూర్ణచంద్‌.
సుప్రసిద్ధ ఆర్కియాల జిస్ట్‌ ఎ.ఎస్‌.రావు సింధు నగ రాలలో వైదిక ఆర్యులు పూర్వ ద్రావిడులు సహజీవనం చేసా రని పేర్కొన్నారని పూర్ణచంద్‌ పేర్కొన్నారు. మైఖేల్‌ విట్జ్‌ల్‌ అన్న పరిశోధకులు కూడా వరి, నాగలి వంటి పదాల వ్యుత్ప త్తులను నిర్వచనాలను ఎత్తిచూపి ఆర్యులు, ద్రావిడుల సహ జీవనం చేసారన్నారు అని కూడా పూర్ణచంద్‌ చెప్పారు.
ఋగ్వేదకర్తలకన్నా భిన్నమైన సంస్కృతి కలిగిన ప్రజలు భారతదేశంలో అనాది నుంచి వుండేవారన్న పూర్ణచంద్‌ గారి మాటలను మేము ఇక్కడ ఒక విధంగా సమన్వ యంచేసి చూపుతున్నాం. వేదాలు మహాతపస్సంప న్నులైన ఋషులు విన్నవి కావున శ్రుతలైనవి. 'వేదాలను ఋషులు దర్శించారు కాబట్టి ఆ ఋషులు ద్రష్టలైనారు, కాబట్టి వేదాలు అపౌరుషేయములయ్యాయి. అయితే తాము వినిన వాటిని
దర్శించిన వాటిని, అప్పటికే వాడుకలో వున్న భాషలోనే వారు ప్రకటించి వుండాలి కదా! ఆనాటి వాడుక భాషలో వైదిక సంస్కృతభాషా జనంతో పాటు ఫ్రోటో ద్రావిడులైన వ్రాత్యులు కూడా సహజీవనం చేస్తున్నారు. కాబట్టి తాము వినినదాన్ని, ఋషులు తమ వాడుక భాషలో అంటే సంస్కృత బహుళమైన భాషలో ప్రకటించి వుంటారు. అట్టి ప్రకటనలో వ్రాత్యులు మాట్లాడే భాషా పదాలు కూడా వుండి ఉంటాయి కదా! కాబట్టి వేదాలలో ప్రక్షటో ద్రావిడియన్‌ పదాలు కూడా కలిసి వుండే ఆస్కా రం వుంది అన్నది మా సమన్వయవాదం.
ఎ.పి.కల్మార్కర్‌ వైదిక వ్రాత్యులనే నేడు మనం ద్రావి డులనుకుంటున్నాం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందుకు వారు చూపించిన ప్రమాణాలలో పూర్ణచంద్‌ తమ గ్రంథంలో ప్రకటించిన ఋగ్వేదసూక్తాలు కూడా వున్నాయని మనం ఇచట గుర్తించుకోవాలి. (ఋగ్వేదం 1-15-8, ఋగ్వేదంలో 10-86-19)- ఋగ్వేదంలోని తొలిమండలాలలో ఆర్యుల, ఆర్యేతరులైన వారిని కూడా కలిపి (వ్రాత్యులు) అర్థదేవతలుగా పరిగణఙంచినట్లు సంస్కృత నిఘంటువు అమరకోశంలో చెప్పబడిందని మనం గమనించాలి. అమరకోశంలో అసురదైత్య దైతేయ, ధను, దానవ, దితిసు, ఈ
పదాలన్నీ సమానార్థకాలుగానే ఉన్నాయి. వీళ్లం దరూ ఆర్యుల ధర్మాన్ని గౌరవించి సఖ్యతతో వుండి ఉంటారు. కాబట్టి వీళ్లకి అర్ధదేవతలనే గౌరవం దక్కివుంటుంది. అంటే సగం ఆర్యులన్నమాట. ఆర్యులతో సంలీనం కాని వారు ఎలా అర్ధ దేవత లౌతారు? బహుశ వీరి మధ్య సాంస్కృ తిక, సామాజిక సంబంధాలతో పాటు, వైవాహిక సంబంధాలు కూడా ఎక్కువగా జరిగి వుండాలి అం టారు పూర్ణచంద్‌. తలపైన కొమ్ము,చుట్టుకొన్ని జంతు వులమధ్య యోగాసనంలో కూర్చుని ఒకదైవరూపం సింధు ముద్రికలలో దొరికిందికదా.
ఋగ్వేదంలో దాశరాజ్ఞ యుద్ధం ఒక సుప్రసిద్ధ చారి త్రక సంఘటనగా చెప్పబడింది. ఆ పదిమంది రాజులలో మాత్స్యుల, భక్తులు, భళానులు, ఆళీనులు, నిషానులు, అజులు, శివులు, శిగ్రులు, యక్షులు వంటి వారంతా వున్నారు. వారంతా సుదాసుడనే రాజునకు ఏదో ఒక సమయంలో వ్యతిరేకంగానో,అనుకూలంగానో, నిలబడిన వారేనని ఋగ్వేద ఆర్యులు అన్న పేరున గల తన గ్రంథంలో సుప్రసిద్ధ వైదిక పరిశోధకులు రాహులు సాంకుృత్యాయన్‌ చెప్పారని పూర్ణచంద్‌ తన రచనలో చెప్పారు. ఎ.పి.కల్మార్కర్‌ కూడా ఆ సంగతిని దాశరాజ్ఞ యుద్ధ వివరణలో చెప్పివున్నారని మనం ఇక్కడ గుర్తించాలి.
సమాజంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థలు వేరువేరు అంశాలు. ఆర్యులది వర్ణవ్యవస్థ, ద్రావిడ తెగల వారిది కులవ్యవస్థ. కాలక్రమంలో ఈ రెండూ కలగలసి బ్రహ్మ క్షత్రియ వైశ్య శ్రూదులకు అదనంగా దళితులు హిందూ సమాజ వ్యవస్థలో చేర్చబడి అనాది నుంచి వస్తున్న నాలుగు వర్ణాలకుపైన పంచములు క్రొత్తగా చేర్చబడ్డారా అని కూడా వారు అడుగుతున్నారు.
ఆర్యేతరులైన వ్రాత్యులనుండే కులవ్యవస్థ హిందూసమాజంలో ఆరంభమయిందా? అన్న ప్రశ్నను

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కూడా అడిగారు. వైదికమైన పంచవింశ బ్రాహ్మణంలోను, అథర్వణవేదంలోను ఈ ప్రశ్నకు సమాధానం వున్నదన్నారు అంబేద్కర్‌.
వ్రాత్యులే అర్హంతులు, ¸°ధులుగా విభక్తులయ్యా రనీ, అధర్వణవేదంలో ఏకవ్రాత్యుల నుండి రాజస్య బ్రాహ్మణ వర్గాలు వచ్చినవంటారు అంబేద్కర్‌. పంచ వింశబ్రాహ్మణంలో హీనులు, గరాగిరులు, సమనీచ మేఢ్రులు, నిందితులు అన్న నాలుగు విభాగాలు ఏర్ప డినవి అంటూ,ఏవేవో కారణాంతరాల చేత వెలివేయ బడిన ప్రజావర్గాల నుండి పంచములు అన్న విభాగం కాలక్రమంలో ఏర్పడి ఉంటుందంటారు అంబేద్కర్‌.
ఆర్య భాష మాటాడిన ప్రజలకు అడుగడుగునా ద్రవి డయన్లు ఎదురయ్యారు. ఆర్యులు వారిని దాసులు, దస్యు లు ఇలా అనేక పేర్లతో పిలుచుకున్నారు. వీరు తమకన్నా అత్యున్నత నాగరికులని సంపన్నులని బలమైన నగరాలు కలిగిన వారిని ఆర్యులు వైదిక సాహిత్యంలో వర్ణించారు. కర్మార్కర్‌ కూడా తమ రచనలో ఇట్టి వర్ణనల వివరాలు ప్రకటించి వున్నారుకూడా. అయితే దాస, దస్యాది ఆర్యే తర ప్రజలు సుసంపన్నులుగా వున్నంత కాలం ఆర్యుల నుండి ఇట్టి ప్రశంసలు పొందుతూనే వున్నారు. సింధు నగరాల పతనం తర్వాత వర్తక, వాణిజ్యాదులు లేక ఈ దానవులు ఈ దస్యులే నల్లవారుగా, అస్పృశ్యులగా, బానిస లుగా నిందింపబడ్డారా? అంటూ ఒక సహజమైన సందే హం రేకెత్తించిన పూర్ణచంద్‌ అస్పృశ్యతా వివక్షలు ఆనాటి నుంచీ హిందూ సమాజంలో ప్రవేశించి పంచములుగా వెలియే యబడిన కొందరు బాధలకు లోనవుతున్నారని అంటారు పూర్ణచంద్‌. నిజంగా ఇది ఒక చర్చనీయాం శంగా పరిశీ లనాంశమే కదా.
బహుభాషా కోవిదులు తిరుమల రామచంద్ర తెలుగు, ప్రాకృత భాషల సంబంధాలను గురించి వ్రాస్తూ ప్రాకృ తం ప్రథమ భాష, ప్రజల నిత్య వ్యవహార భాష, ప్రజల ప్రేమ భాష, కష్టసుఖాల భాష, ఇదే ప్రకృతుల ప్రాకృతుల భాష అని తీర్మానించారు. మానవజాతి తొలి ఛందో రూపమైన ఋగ్వేదంలో ప్రాకృతభాషా రూపాలు కనిపిం చినందువల్ల ఋగ్వేదభాషకన్నా అతిభిన్నం అపరిష్కృతమైన ఒకభాష ఆనాడు వాడుకలోవుండేది. అది ప్రాకృతమూల మన్నారు. సంస్కృత వాఙ్మయచరిత్ర వ్రాసిన మల్లాది సూర్యనారాయణశాస్త్రి 'ఛందో' అనే వేదసంజ్ఞతో పిలువ బడిన సంస్కృతశబ్దాలు భాష అన్న సంజ్ఞతో పిలువబడిన లౌకిక శబ్దాలు తొలిదశలో ఒకేనని, కాలానుగుణంగా లౌకిక సంస్కృత భాషగా అది వికసించిందని అట్టి లౌకిక భాష విశృంఖలంగా వాడబడుతున్నపుడు 'పాణిని' దానిని సంస్క రించేందుకు పూనుకున్నారు.
- కె. ఘనశ్యామల ప్రసాదరావు