12, ఫిబ్రవరి 2011, శనివారం

28న చిరంజీవి విలీన ‘వివరణ’ సభ

ఈ నెల 28వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చిరంజీవి భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులోని విలీనం చేయాలని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలకు తెలియ చేయాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి నిర్ణయించినట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాదులో అభిమానులతో సమావేశమైన చిరంజీవి తన అభిమానులను, కార్యకర్తలను విలీనానికి సుముఖం చేసే ఉద్దేశ్యంతో ఈ సభను నిర్వహించాలని నిర్ణయం పలువురు ఇష్టపడక పోయినా.. కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటానని సోనియా తనకిచ్చిన భరోసాని చెప్పడంమే కాకుండా ప్రజలకు మనం ఎందుకిలా చేయాల్సి వచ్చిందో... విపక్షం దిగజారుడు రాజకీయాలు చేసున్న వివరాలను వెల్లడించాల్సిన తరుణం ఇదేనని.. ఈ సభకు భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి అభిమానులని తరలించాలని చిరంజీవి సూచించి నట్లు సమాచారం