16, ఆగస్టు 2011, మంగళవారం

నగరం నిద్రపోతున్న వేళ సెన్సార్ బి(క)ట్స్

గురుదేవ క్రియేషన్స్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకాన నంది శ్రీహరి నిర్మించిన చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ'. జగపతిబాబు, చార్మి, చంద్రమోహన్‌, ఆహుతి ప్రసాద్‌, బాబూమోహన్‌, శివారెడ్డి ముఖ్యపాత్రధారులు. లక్ష్మీ నరసింహం ఛాయాగ్రహణాన్ని, యశోకృష్ణ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే దర్శకత్వం ప్రేమ్‌రాజ్‌ సమకూర్చారు.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి .......... కట్స్‌తో 22-6-11న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
మూడు నాలుగు రీళ్ళలో :
1) బాటిల్‌ మీద 'బ్రేజర్‌' అని వున్న లేబుల్‌ తొలగించమన్నారు.
2) వ్యభిచరిస్తున్నట్టుగా హిజ్రాలను చూపే దృశ్యాలు. ఆ దృశ్యాల్లో వచ్చిన డైలాగ్స్‌ తొలగించారు.
3) మింట్‌ రెస్టారెంట్లో డ్రగ్స్‌ వాడకం, లిప్‌లాక్‌ (పెదవితో పెదవి కలిపి ముద్దాడు) దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమన్నారు.
4) అయిదు ఆరు రీళ్ళలో ఛానెల్‌ ఎండిని ఉద్దేశించి 'కొజ్జావాడు' అని జగపతిబాబు అన్న మాటని తొలగించారు.
5) ఏడు ఎనిమిది రీళ్ళలో ఎన్నికల్లో గెలుపుకి సంబంధించి బాబూ మోహన్‌, ఎంఎల్‌ఎ, హిజ్రాల మధ్య వచ్చిన సంభాషణ కత్తెర పాలయింది.
ఎనిమిది తొమ్మిది రీళ్ళలో :
6) ఎ. రెడ్‌ డ్రెస్‌లో ఐటమ్‌ డ్యాన్సర్‌ యొక్క క్లీవేజ్‌ ఎక్స్‌పోజర్‌ తొలగించారు.
బి. ఇదే డ్యాన్స్‌లో ఐటమ్‌సాంగ్‌ చేసే డ్యాన్సర్‌ బొడ్డుకు సంబంధించిన దృశ్యం, కెమెరాను పై నుంచి జూమ్‌ చేయడం, డ్యాన్సర్‌ పిరుదలకు దగ్గరగా పురుషుల ముఖాలు ఉంచటం వంటి దృశ్యాలను తొలగించారు.
7) పదకొండు పన్నెండు రీళ్ళలో ప్రజలతో కలసి ఛార్మి ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ని చంపే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
8. సినిమాలో ఎక్కడ 'ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌' అని వచ్చినా ''ట్రాన్స్‌పోర్ట్‌ '' పదాన్ని తొలగించమన్నారు.
9. సినిమాలో 'రెడ్డి' అనే పదం ఎక్కడ వచ్చినా అది తొలగింపుకు గురి అయింది.
3800.95 మీటర్ల నిడివిగల 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రం 24-6-11న విడదలైంది.