16, ఆగస్టు 2011, మంగళవారం

భాషా ప్రాధాన్యతను పట్టించుకునే నాథుడేడీ?: ఎం.పి. లగడపాటి


ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో తెలుగుభాషలో విద్యాభ్యాసం నిర్బంధం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తల్లి కష్టాలలో ఉందని, కన్నీళ్ళు పెట్టుకుందని, భాషా ప్రాధాన్యతను వర్ధమాన కవులు, రచయితలు గుర్తించి యువతకు మన భాష ఔన్నత్యాన్ని చాటితే తప్ప మధురమైన భాషగా ముందడుగు వేయదని అన్నారు. మాతృభాషను గుండెలో పదిలంగా పెట్టుకోవాలని, తద్వారా తెలుగుతల్లి, తెలుగునేల సమైక్యంగా ఉండాలని ఆయన అభిలషించారు. ఈ సభలో ప్రారంభోపన్యాసం చేసిన మండలి బుద్ధప్రసాద్‌ లగడపాటికి ఒక సూచన చేస్తూ, ఎందరో మహనీయులు మొక్కవోని దీక్షతో కృషి చేయగా తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించిందని, అయితే ఇంతవరకు నిధులు విడుదల కాలేదని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో రాజగోపాల్‌ ఈ అంశాన్ని లేవనెత్తి ఈ నిధులను రాబట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.