26, ఏప్రిల్ 2011, మంగళవారం

దమ్ముంటే మీరంతా రాజీనామా చేయండి

వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులకు ఆ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ నేపథ్యంలో వైయస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ల మధ్య రాజీనామాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరందుకున్నాయి.
మంగళ వారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్స్ పార్టీకి దమ్ముంటే తన శాసన స్భులందరి తో రాజీనామా చేయించి మళ్ళి ఎన్నికలకి సిధం కావాలని అన్నారు. రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీ నాయకులు సోనియా ఫొటోతో పోటీ చేయాలని, తమ పార్టీ వైయస్సార్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. కడప ఎన్నికల ఫలితాలే కాంగ్రెసుకు సమాధానమిస్తాయని ఆయన అన్నారు.

గెస్ట్ రోల్స్ కి పరిమితమై పోతున్న నితిన్

ఈ మధ్య సరైన సినిమాలు లేక, ఉన్నా అవి సక్సెస్ జేక.. చాటికిల్ల పడ్డ హీరో రేసులో బాగా వెనుకపడిపోయిన నితిన్ ఇప్పుడు పాత్ర దొరకడమే అరుదనుకోతున్నాడూ ఏమో.. సెకండ్ హీరో గా కూడా రెడీ ఐపోతున్నాడు. పవన్ సినిమాలో రెండూ పాత్రనే పోషించేందుకు సిద్దమైన నితిన్ ఇప్పుడు ప్రభాస్ కథానాయకుడుగా రాజమౌళి రూపొందించే సినిమాలో ఓ ముఖ్య పాత్రకు సెలెక్ట్ అయినట్లు సమాచారం.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'సై' సినిమా లో నితిన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఈ చిత్రం 'ఈగ' సినిమా పూర్తయ్యాక ప్రారంభిస్తాడు.

నాగ ప్లేస్ లో అల్లు అర్జున్‌కి చోటిచ్చిన దశరథ్

ఈ మధ్యనే దర్శకుడు దశరథ్ ప్రభాస్ తో రూపొందించిన 'మిస్టర్ పెర్ ఫెక్ట్' హిట్ టాక్ తెచ్చు కావటంతో.. కాస్త గాప్ లో తన తదుపరి చిత్రం కోసం ప్లాన్ చేసుకుంటున్నడట . ఐతే గతంలో ఈ చిత్రాన్ని నాగార్జునతో రూపొందించాలని భావించినా.. ఇప్పుడు తాను అనుకున్న కధకి నాగ్ కన్నా అల్లు అర్జున్‌ అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. దీంతో ఇటీవల దశరథ్ అర్జున్ ని కలసి కథ చెప్పడం జరిగిందట. కధ పక్కగా ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గుతున్నట్లు వుందని దీన్ని మార్చుకొంటే చేయటానికి అబ్యంతరం లేదని అర్జున్‌ చెప్పాడట. ఏది ఏమైనా వీరి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్క డం ఖాయమని ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారం.

దాసరి 'రామ సక్కని తల్లి' అనుష్క?

బాలకృష్ణతో తీసిన 'పరమ వీర చక్ర' బాక్సాఫీసు ముందు పల్టీ కొట్టడంతో ఈ మధ్య ఒసేయ్...రాములమ్మా' రేంజ్ లో విజయశాంతి తో ఓ చిత్రానికి ప్లన్చేసాడు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు.

. త్వరలో మరో భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తునే 'రామ సక్కని తల్లి' అనే టైటిల్ ను చేశారు. అయితే, దాసరి వ్యవహారం ఇబ్బందులు గా ఉండటంతో.. విజయ శాంతి.. ఈ సినిమాకి నో చెప్పేసిందట దీంతో నేటి యంగ్ హీరోయిన్ తో ee చిత్రాన్ని దాసరి రూపొందించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో అనుష్క నటించే అవకాశం వుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

కడపలో ధనం ఏరులై పారుతోంది.

లోక్‌పాల్ బిల్లును కుందిo చాలని   చూడటం దుర్మార్గమైన చర్య అని..  బిల్లు పరిధిలోకి ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్‌లనూ తీసుకురావాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం త్రిశంకు స్వర్గంలో వే లాడుతోందన్నారు.చట్టాలు, బిల్లుల ద్వారా అ వినీతి నిర్మూలన సాధ్యం కాదన్నారు. అవినీతి ఎజెండాతో ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రచారాలు చేపడతామన్నారు.భారతదేశంలో ఏ పార్లమెంటు ఎన్నికలకు ఖర్చు పెట్టని విధంగా కడపలో ధనం ఏరులై పారుతోందని నారాయణ ఆరోపించారు.  ఎన్నికలు పేరు చెపితేనే భయపదీలా ఈ ఎన్నికల్ని మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసారాయన.

23, ఏప్రిల్ 2011, శనివారం

బొమ్మరిల్లు బాణిలో నడిచిన మిస్టర్ ఫెరఫెక్ట్.


బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: ప్రభాస్,తాప్సీ,కాజల్ ,ప్రకాష్ రాజ్,కె విశ్వనాధ్,నాసర్,బ్రహ్మానందం,రఘుబాబు తదితరులు.
కూర్పు: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: విజయ్ కే చక్రవర్తి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం:దశరధ్

తన ఫార్ములాని తానీ ఫాలో అవుతూ ప్రేక్షకులు బాగా నచ్చిందని మెచ్చుకుని హిట్టు చేసారనే నెపంతో మళ్ళి అదే ఫార్మె లాకి కాస్త డోస్ పెంచి దిల్ రాజు నిర్మించిన చిత్రమే మిస్టర్ ఫెరఫెక్ట్.
ఇంతకీ కదేమిటంటే ..
దేనికీ రాజీపడని వ్యక్తిత్వం ఉన్న విక్కి(ప్రభాస్) ఈవ్యక్తి అయినా తనకోసం,తన సంతోషం కోసమే బ్రత కాలి... ఇతరులకూసం తన ఇస్తాలని మార్చుకో కూడదనే మనస్తత్వం. ఆస్ట్రేలియాలోఉండే విక్కీ ఓ సారి చెల్లి పెళ్ళికోసం ఇండియా వస్తాడు. ఇక్కడ విక్కి తండ్రి తన మిత్రుడు కూతురు ప్రియ(కాజల్) తో పెళ్లి చేయాలనీ భావిస్తారు.
ప్రియ తనకి చిన్ననాటి స్నేహితురాలు కూడా కావడంతో విక్కి అంగీకరించినా.మనం ప్రతీ సినిమాలో చూసినట్లే వ్యతిరేకమైన భావాలు గల వ్యక్తిత్వం ఈ హీరొయిన్ద్ర. మొదట విక్కీ వ్యవహారం నచ్చక చిరాకు పడ్డా తర్వాత నెమ్మదిగా ఆయన గారి ప్రేమలో పడ టమే కాక ఆయన గారి కోసం తన ఆలోచనలను,అలవాట్లను, చివరకి తను ఊహించుకొన్న జీవితాన్ని మార్చేసుకోవటానికి కూడా సిద్దపడుతుంది.

తనకోసం నీ ఇష్టాలు మార్చుకోవడం అంటూ ప్రియతో విభేదించిన విక్కీ ...ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఉండాలి వేరొకరి కోసం మన ఇష్టాలు మార్చుకుంటే పోతే చివరకు మనకంటూ ఏదీ మిగలదు అని పెద్ద క్లాస్ పీకి ప్రియకు గుడ్ బై చెప్పేసి వచ్చిన దారినే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు.

అక్కడ తనలాంటి ఆలోచనలతోనే ఉన్న మ్యాగి(తాప్సి) తారస పడుతుంది .. ఒకరినొకరు ఇస్తా పడతారు. డేటింగ్ కు సిద్దపడతారు. మరి ఇండియాలోనే మిగిలిపోయిన ప్రియ చివరకు విక్కిని చేరుకొందా .. లేక విక్కిలో నే మార్పు వచ్చి ప్రియదగ్గరకి వచ్చాడా.. మేగి పరిస్తితి ఏంటి వస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.

నటీ నటులు..
విక్కి గా ప్రభాస్ కాస్త ఫ్యామిలీ హీరోగా నిలవాలన్న తపనతో నటించాడనిపిస్తుంది. ఉన్నంతలో బెటర్ గా చేయడానికి యత్నించాడు. ప్రియగా కాజల్ పాత్ర దిల్ రాజు బృందావనంకి కొనసాగింపు లా ఓదార్పు పాత్ర. మ్యాగే గా తాప్సి చేసింది తక్కువా... పులకిన్తలేక్కువలా సా..గింది. ప్రకాష్ రాజ్,కె విశ్వనాధ్,నాసర్ లకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. బ్రహ్మానందం,రఘుబాబు ల కామెడి మరీ ఇరికించి నట్లు ఉండి పండలేదు సరి కదా ఇబ్బంది పెడుతుంది

సాంకేతిక వర్గం ...
చానాళ్ల తరువాత దసరద్ కి మరో సరి సత్తా చూపే అవకాశం వచ్చిందనే చెప్పాలి ఐతే స్క్రీన్ ప్లే లో లోపాలు బోలెడు మనల్ని విసిగిస్తాయి. విజయ్ కే చక్రవర్తి కెమెరా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ చాల మేరకు బోర్ నుంచి ప్రేక్షకుడిని కాపాడాయనే చెప్పాలి. పాటల్లో ప్రతిభ చూపాలని యత్నించిన దేవిశ్రీ ఎమోషనల్ సీన్స్ లో రీరికార్డింగ్ పైన కూడా దృష్టి పెడితే బాగుండేది.

చివరిగా... బొమ్మరిల్లు లా
అసభ్యత,అశ్లీలం లేకుండా ఫ్యామిలీలను టార్గెట్ చేసి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎ సెంటర్లలో న్చుతుంది కాని బి, సి సెంటర్ ల విషయం అనుమానమే.. ప్రభాస్ రూట్ మార్చి కొత్తగా కనిపించే ప్రయతం చేస్తే .. డాన్ని ప్రేక్షకులు ఎంత వరకు పట్టించు కొన్నారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలి.

22, ఏప్రిల్ 2011, శుక్రవారం

వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ అకస్మిక మరణం

గమ్యం’, ‘నిన్న నేడు రేపు’, ‘సంభవామి యుగే యుగే’ ‘కళావర్ సింగ్’,‘ఎల్‌బిడబ్ల్యూ’ చిత్రాలకు సంగీతాన్ని అందిచిన వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ ఆకస్మికంగా మరణించారు. 33 ఏళ్ళ అనీల్ కు గుందేపూటు రావటంతో ఆయన కుటుంబ సబ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణిం చినట్లు అపోలో వైద్యులు చెప్పారు. గుంటూరు జిల్లా రెంటచింతల కు చెందిన్మ ఆయన సినిమా రంగంలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో ఊహించని విధంగా అకాల మరణం చెందటం పట్ల చిత్ర పరిశ్రమ యావత్తు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.