26, ఏప్రిల్ 2011, మంగళవారం

దమ్ముంటే మీరంతా రాజీనామా చేయండి

వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులకు ఆ పార్టీ ఫిర్యాదు మేరకు స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీ నేపథ్యంలో వైయస్ ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ ల మధ్య రాజీనామాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరందుకున్నాయి.
మంగళ వారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్స్ పార్టీకి దమ్ముంటే తన శాసన స్భులందరి తో రాజీనామా చేయించి మళ్ళి ఎన్నికలకి సిధం కావాలని అన్నారు. రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీ నాయకులు సోనియా ఫొటోతో పోటీ చేయాలని, తమ పార్టీ వైయస్సార్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. కడప ఎన్నికల ఫలితాలే కాంగ్రెసుకు సమాధానమిస్తాయని ఆయన అన్నారు.