30, అక్టోబర్ 2010, శనివారం

రాజీవ్ పేరు పై వెనక్కి తగ్గినా సుబ్బరామి రెడ్డి...

లలితకళాతోరణం ఆధునీకరణ పనులను ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్ నేత టి. సుబ్బిరామిరెడ్డి సీఎం రోశయ్యకు లేఖ రాశారు. లలితకళాతోరణానికి ముందు రాజీవ్ పేరు పెట్టడంపై తలెత్తిన రాజకీయ రగడకు సుబ్బిరామిరెడ్డి మనసు మార్చుకుని జీవోను రద్దు చేయాలని ముఖ్యమంత్రికి వినతి చేశారు. ప్రభుత్వం కొత్తగా స్థలం ఇస్తే ఆడిటోరియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు సుబ్బిరామిరెడ్డి తెలిపారు.