30, అక్టోబర్ 2010, శనివారం

సామూహిక అభిషేకాలకు శ్రీశైల శివయ్య రెడీ

శ్రీశైల దేవస్థానంలో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సామూహిక, ప్రత్యేక అభిషేకాలకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆలయ ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు.

శివునికి అభిషేకాలు చేసేందుకు అన్‌లైన్ల ద్వారా టికెట్లను పొందే అవకాశాలను రద్దు చేసినట్లు తెలిపారు. సామూహిక అభిషేకానికి టికెట్టు ధర 600 రూపాయలు, ప్రత్యేక అభిషేకానికి వెయ్యి రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, 30మంది ప్రత్యేక సెక్యూరిటిని 6నెలల పాటు విధులను వినియోగించుకుంటామని, వీరు నవంబర్ 1వ తేదీ నుండి విధులకు హాజరు అవుతారని తెలిపారు