30, అక్టోబర్ 2010, శనివారం

చందా లేసుకొని సోమ్ములిస్తాం... జగన్ జపం మానాలని కొండా దంపతులకు సూచన

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సాధనకు ప్రత్యేక తెలంగాణ గులాబీ దళం ప్రత్యక్ష పో రాటం చేస్తుందని టీఆర్ఎస్వీ రాష్ట్ర అ ధ్యక్షుడు బల్క సుమన్ వెల్లడించారు.

టీ ఆర్ఎస్వీ నూతన కమిటీ ఏర్పాటు చే సిన వారం రోజుల్లోనే 50వేల సభ్య త్వం నమోదు చేసినట్టు తెలిపారు. కొండా దంపతులు ఇకనైనా జగన్ జపం మానాలని, జగన్ వద్ద పెట్టుబడులుంటే, నష్టపోతామనుకుంటే విద్యార్థులందరూ ఒక్కొక్క రూపాయి పోగేసి అందచేస్తారని అన్నారు. మహబూబాబాద్ లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు

రాజ్యాంగ బద్ధంగా పోరాటం చేసేందుకు గులాబీ దళాన్ని సిద్ధం చేసి, తె లంగాణా సాధించేందుకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ సాధన మలిదశ పోరాటంలో భాగస్వాములను చే సేందుకు డిసెంబర్‌లోగా 15లక్షల మంది విద్యార్థులతో గులాబీ దళాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.