17, నవంబర్ 2010, బుధవారం

23వ తేదీలోగా ఓటరుగా నమోదు కండి

కొత్త ఓట్ల నమోదుకు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రా ష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1నాటికి 18 ఏళ్ళ వయస్సు నిండిన యువతీయువకులు ఈ ఓట్లు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓట్లు నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందన్నారు. ఫారం-6ను పూర్తి చేసి ఫొటోలతో కొత్త ఓటుకు దరఖా స్తు చేసుకోవాలన్నారు. గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన వారు పేర్లను తొలగి స్తారని అన్నారు. ఓటర్లు జాబితాలో పేర్లు ఉండి ఫొటోలు లేకపోయిన, ఫొటోలు ఉండి పేర్లు లేకపోయినా? నమోదు చేసుకోవచ్చని... పేర్లు నమోదు సరిచేసుకునేందుకు ఫారం-8ను పూర్తి చేసి అధించాలన్నారు.