17, నవంబర్ 2010, బుధవారం

బాబు పర్యటనకు అడ్డొస్తే సహించం

తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనకు అడ్డొస్తే సహించేది లేదని, టీఆర్‌ఎస్ శ్రేణులను ఎదిరిస్తామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎంపీ రాథోడ్ రమేశ్ హెచ్చరించారు..

కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని, పార్లమెంటులో ఒక్కసారి కూడా తెలంగాణ అంశం ప్రస్తావించలేదని ..
తెలంగాణ ఎవరి జాగీరు కాదని, నాలుగు కోట్ల ప్రజల సొంతమని అన్నారు..

ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని... రోశయ్య సిఎం గా పదవిలోకి వచ్చి ఏడాది అయినా.. పాలనపై పట్టు లేదని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు.