17, నవంబర్ 2010, బుధవారం

యడ్యూరప్పని కొనసాగాలా? వద్దా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప భవితవ్యాన్ని తేల్చేందుకు త్వరలో రాష్ట్రానికి పరిశీలకులను పంపి రహస్యంగా శాసనసభ్యుల నుంచి అభిప్రాయ సేకరణ చేయనున్నారు.

అవినీతి ప్రకరణలకు సంబంధించి కేంద్రంలో బీజేపీ దుమ్మెత్తి పోస్తూ, కర్ణాటకలోని అవినీతిపై మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చింది
భూ కుంభకోణాలు, ఇతర అవినీతి ఆరోపణల్లో కూరుకున్న యడ్యూరప్ప ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన పార్టీ హై కమాండ్ పంపే కమిటీ ప్రత్యేకంగా శాసనసభ్యులను కలసి రాష్ట్రంలో యడ్యూరప్ప నాయకత్వం కొనసాగాలా? వద్దా? అనే అంశాన్ని గురించి అభిప్రాయాలను సేకరించనున్నారు