17, నవంబర్ 2010, బుధవారం

పోలవరంతో గోదావరి జిల్లాలకు ప్రమాదం

150 అడుగుల ఎత్తుతో పోలవరం వద్ద నిర్మించతలపెట్టిన మట్టి కట్ట వల్ల ఉభయగోదావరి జిల్లాలకు ప్రమాదం పొంచి ఉందంటూ ..డ్యామ్ నిర్మించకుండా కాల్వలు తవ్వడం వల్ల కాంట్రాక్టర్లు లాభపడ్డారని.... కాంగ్రెస్ పార్టీకి చెందిన అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ లేవదీసిన వివాదం చిలికిచిలికి గాలివానలా మారే పరిస్థితి కన్పిస్తోంది.

రెండు లక్షల మంది గిరిజనులు ఈ ప్రాజెక్టు ముంపుతో నిర్వాసితులవుతున్నారని.. వారందరికీ మె రుగైన పునరావాసం కల్పించాలంటూ హర్షకుమార్ డిమాండ్ చేయటం.. చర్చకు తెరలేపడమీ కాక... పోలవరానికి ప్రస్తుతం తలపెట్టిన నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు ఉన్నావాటిపై దృష్టి సారించలేదని ...ప్రస్తుత డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించ డం చర్చనీయంసమవుతొన్ది .