18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

కృష్ణా జిల్లాను 12 రాష్ట్రాలుగా విభజించండి

తమ వాదనలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై భౌతిక దాడులకు దిగుతుంటే బజారు రౌడీలకూ, ప్రజాప్రతినిధులకూ తేడా ఏమిటని ఎంపీ కావూరి సాంబశివరావు ప్రశ్నించారు.శాసనసభలో గురువారం జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యవాదులు బాధపడేవిగా ఉన్నాయన్నారు. . "రాష్ట్రం రెండుగా విభజించడానికేం ఖర్మ.. ప్రతి 50 వేల జనాభాకూ ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్-సికింద్రాబాద్‌లను 8 రాష్ట్రాలుగా, కృష్ణా జిల్లాను 12 రాష్ట్రాలుగా విభజించాలని కోరుకుంటున్నాను'' అని వ్యంగ్యంగా అన్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను కొడితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ నెరవేరుతుందనుకుంటున్నారేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.