18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఐదుగురు ఎమ్మెల్యేల అరెస్టు?

శాసనసభలో గురువారం చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్ నరసింహన్ తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెలుబుచ్చారు. దాడులకు పాల్పడిన ఐదుగురు ఎమ్మెల్యేలను ఉపేక్షించకూడదంటూ సర్కారును ఆదేశించినట్లు సమాచారం. దీంతో.. దాడికి కారకులైన ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెం డ్ చేయడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సర్కారు రంగం సిద్ధం చేసింది.