6, మార్చి 2011, ఆదివారం

కిరణ్ పాలన రాక్షసపాలనను తలపిస్తోంది

ఎమ్మెల్సీ ఎన్నికలకు జగన్ వర్గం పోటీ చేయడంలేదని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పార్టీ ఏర్పాటుచేయకుండా ఎన్నికల్లో పోటీ చేయబోమని పేర్కొన్నారు. తమ వర్గంలో ఉన్నవారు మనస్సాక్షి ప్రకారం వ్యవహరించాలని చెప్పామన్నారు. టీఆర్ఎస్, జగన్ కుమ్మక్కయ్యారని వస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. చంద్రబాబునాయుడు, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కుమ్మక్కవుతున్నారని ఆయన ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి 100 రోజుల పాలన రాక్షసపాలనను తలపిస్తోందని విమర్శించారు.