4, మార్చి 2011, శుక్రవారం

అధిష్టానం మా గొంతులు నొక్కేస్తోంది...

నిన్న లోక్'సభలో తెరాస సభ్యులతో కల్సి తెలంగాణ కోసం నినాదాలు చేసిన అరుపులు కేకలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపిలు నోటికి నల్ల గుడ్డలు అడ్డు పెట్టుకుని వచ్చి లోక్‌ సభలో నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణా కావాలంటూ ప్లే కార్డులు ప్రదర్శించడం పట్ల స్పీకర్‌ మీరాకుమార్‌ ఆ విధంగా వ్యవహరించకూడదని..అసహనం వ్యక్తం చేసినా... ఫలితం లేకపోయింది.

ఓ దశలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినా వారు పట్టించుకోకపోవటం కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడలేదు. నిన్న రాత్రి ప్రణాబ్‌తో సమావేశమైన ఎంపీలు అధిష్టానం తమ గొంతు నొకేస్తోందన్న అభిప్రాయం సర్వ్‌త్రా వినిపిస్తుండటంతో పాటు నిన్న రాజీ నామాలకు రడీ అయిన వారు నేడు నిరసనకే పరిమితం కావటం వెనుక ఆంతర్యం అంతు పట్టకుండా ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.