4, మార్చి 2011, శుక్రవారం

మిలియన్‌ మార్చ్‌పై జెఏసీకి హైకోర్టు నోటీసులు

మిలియన్‌ మార్చ్‌ ప్రభావం ఇంటర్‌ విద్యార్ధుల పరీక్షలపై పడుతోందని... పరీక్ష జరుగుతుందని మంత్రి చెపుతుంటే, వాయిదా వేస్తూన్నట్లు ముఖ్యమంత్రి విపక్షాలకు హామీ ఇస్తూ అయోమయం సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ... దాఖలైన పిటీషన్‌ని విచారణకు స్వీకరించింది.

వరంగల్‌ జిల్లాకు చెందిన సాంబరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌లో మార్చ్‌ 10న తెలంగాణా ఐకాస ఆధ్వర్యంలో జరుగు మిలియన్‌ మార్చ్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షని వాయిదా వేయాలని కోరటం సమంజసం కాదని.. ప్రస్తుత పరిస్ధితి కారణంగా లక్షలాది విదార్ధులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని... పరీక్షలకు అడ్డకులు సృషించవద్దని ఆదేశాలివాలని కోరుకున్నారు.ఈ పిటీషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్రంగా స్పందిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై తీసుకున్న చర్యలని వివరించాలని ఆదేశాలివ్వటమే కాకుండా మిలియన్‌ మార్చ్‌ నిర్వహిసున్న తెలంగాణా ఐకాసకు, ఉద్యోగ జేఏసీకి కూడా నోటీసులు జారీ చేసింది.