4, మార్చి 2011, శుక్రవారం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు

తెలంగాణపై రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపజేసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనాలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపచేసినా కేంద్రంలో స్పందన కరువైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో.. ప్రజలు రోడ్డుపైకి వచ్చినా, ఉద్యోగుల సహాయనిరాకరణ జరుగుతున్నా, రాష్ట్రంలో పరిపాలన స్తంభించినా..తెలంగాణ కోసం 600 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.ఉద్యోగులు సహాయనిరాకరణ చేస్తున్నా..ఉద్యమాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు.. చేస్తున్నా కేంద్రం దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని,పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని, బీజేపీ, ఇతర పార్టీల విజ్ఞప్తి మేరకు సభకు అడ్డుతగలకుండా వాకౌట్ చేశామని ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై..తమ రాజీనామాలపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.