29, సెప్టెంబర్ 2012, శనివారం

బాలుకులతా మంగేష్కర్‌ అవార్డు

రఖ్యాత గాయకులు ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్‌ నారాయణ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం లతా మంగేష్కర్‌ సంగీత పురస్కారాలు-2012 ప్రకటించింది. వారితోపాటు ఉస్తాద్‌ గులాం అలీ, పర్వీన్‌ సుల్తానాలకు ప్రత్యేక పురస్కారాల కోసం ఎంపిక చేశామని సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి తెలిపారు. శుక్రవారం జూబ్లిdహాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అలనాటి నేపథ్య గాయని రావు బాలసరస్వతి, ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ డి నాగేశ్వర రెడ్డిలతో కలిసి మాట్లాడారు. భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె పేరు మీద వరుసగా మూడో ఏడాది సంగీత పురస్కారాలను ప్రకటించినట్లు చెప్పారు. నవంబర్‌ 2న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అంద జేస్తామని అన్నారు. పురస్కా రాల కింద రూ. లక్ష నగదు, ప్రశంసాపత్రం, లతా మంగేష్కర్‌ ట్రోఫీ రూపంలో వీణను ప్రదానం చేస్తామని వివరించారు. రంగస్థల గాయకులను కూడా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది హైదరాబాద్‌కు చెందిన శ్యామ్‌సన్‌ ముఖేష్‌, సురేఖామూర్తిలకు ఈ అవార్డులను అందజేయనున్నామని అన్నారు. సింగింగ్‌ స్టార్‌ పేరుతో వారిని గౌరవిస్తామని అన్నారు. 'యువ ప్రతిభ' అవార్డు కోసం కోల్‌కతకు చెందిన కౌశికి చక్రవర్తిని ఎంపిక చేశామని చెప్పారు. పండిట్‌ రవిశంకర్‌, గాయకులు పి సుశీల, ఎస్‌ జానకి, చిత్ర, కవితా కృష్ణమూర్తి, అల్కా యజ్ఞిక్‌లకు లతా మంగేష్కర్‌ జీవిత సాఫల్య పురస్కరాలను అందజేస్తామని అన్నారు.
తొలి ఏడాది 'ఇండియన్‌ ఐడల్‌' శ్రీరామచంద్రకు, ద్వితీయ సంవత్సరంలో చిత్ర, శంకర్‌ మహదేవన్‌లకు ఈ అవార్డులను అందజేశామని ఆయన అన్నారు.