16, నవంబర్ 2010, మంగళవారం

కేసీఆర్ని రాళ్లతో కొట్టి తరమటం ఖాయం

డిసెంబర్ 31 త ర్వాత కేసీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి ఉద్యమించాలని, లేదంటే ఆయన పదే పదే చెప్పినట్లు రాళ్లతో కొట్టి తరిమే ఘటన చవిచూడాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి హెచ్చరించారు.

టీడీపీ ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని, వాటిని కార్యకర్తలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ..కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని అధినేత చంద్రబాబు చెబుతున్న మాట కేసీఆర్, కేకేల భేటీతో నిజమైందన్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ కుటుంబం తమ జాగీరుగా భావిస్తోందని అలాంటి ఆటలు ఇక ముందు సాగనివ్వమని... తెలంగాణ కోసం దేశం కార్యకర్తలు గళం వి ప్పి ఉద్యమిస్తారని స్పష్టం చేశారు.