16, నవంబర్ 2010, మంగళవారం

తెలంగాణాకోసం తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలి

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే తెలంగాణ ప్రజల బాధలు తీరి, న్యాయం జరుగుతుందని...రాష్ట్రం ఏర్పాటుకు ఆదినుంచి కాంగ్రెస్, టీడీపీలే అడ్డంకిగా మారాయని టీఆర్ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ అన్నా రు.

ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రాంతం అన్నివిధాలా వివక్షకు గురైందని ...తెలంగా ణ ప్రాంతానికి ఆడుగడుగున అన్యా యం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలను తెలంగాణ నాయకులు వీడి ఉ ద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు..
కేంద్రం ఇచేసిన తెలంగాణాని ఆంధ్ర పాలకులు కుమ్ముక్కై మూకుమ్మడి రాజీనామాలు చేసి అడ్డుకోన్నారని అందువల్లే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైందని ...శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా లేకపోతే తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చా రు