19, నవంబర్ 2010, శుక్రవారం

సోనియా గాంధీ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలి

ప్రపంచంలో ఎక్కడా లేని అవినీతి మన దేశంలోనే వుందని.. అవినీతికి మన దేశాన్ని ప్రపంచంలో ఆదర్శంగా తీసుకోవచ్చునన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

సాక్షాత్తు కేంద్ర మంత్రులు,రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి తెలిసే కుంభకోణాలు జరుగుతున్నాయని.... సోనియా గాంధీ, సీఎం రోశయ్య ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.