19, నవంబర్ 2010, శుక్రవారం

రేపు సీమాంధ్ర బంద్‌

ఎసై్స రాతపరీక్ష వాయిదాపై నిరసనగా రేపు సీమాంధ్ర ప్రాంత బంద్‌కు సమైక్యాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది.
తెలంగాణ వాదుల ఒత్తిడికి తలొగ్గి ఎస్ఐ రాతపరీక్షలు వాయిదా వేయడం రాష్ట్ర ప్రభుత్వ నైతిక ఓటమికి నిదర్శనమని...ప్రభుత్వ చేతగాని తనంతోనే ఈ నిర్ణయం తీసుకుందని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకుని యథావిధిగా పరీక్ష జరిగేలా చూడాలని సీమాంధ్ర జేఏసీ డిమాండ్‌ చేసింది.

ఎంతో మంది నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వం నిళ్లుజల్లడం అన్యాయమని ..వేర్పాటువాదులు చేసే ఉద్యమానికి లొంగిపోయి నిరుద్యుగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. సీఎం రోశయ్యను తక్షణం పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు