19, నవంబర్ 2010, శుక్రవారం

అవగాహన లేకనే 'హర్ష' అలాఅన్నాడు

పోలవరానికి అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు.

రాక్‌ఫిల్ డ్యామ్‌పై అవగాహన లేకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ మార్చాలని ప్రతిపాదిస్తున్న అమలాపురం ఎంపీ హర్షకుమార్‌కు పూర్తి అవగాహన లేదని డిజైన్ మార్పు జరిగితే తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు