13, నవంబర్ 2010, శనివారం

కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల అక్రమ సంబంధం బయట పడింది

తెలంగాణ ఉద్యమం కోసం 600 మంది చనిపోయారని చెప్పే కేసీఆర్ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కాకుండా, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనడం చూస్తుంటే.. అధికార పార్టీ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు అందుకున్నట్లు స్పష్టమవుతుందni టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌లు ఆరోపించారు

కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కార్యాలయం బ్రాంచి ఆఫీస్‌గా ఏర్పాటు చేసినట్లు స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు అందుకోవడమే గాక తన ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రకటించారని కేసీఆర్ అసలు రంగు, నిజ స్వరూపం బయట పడ్డాయన్నారు.

కేసీ ఆర్ మాటలతో కాంగ్రెస్, టీ ఆర్ ఎస్‌కు అక్రమ సంబంధం ఉన్నట్లు తేటతెల్లమైందని,. తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ అని పదే పదే వ్యాఖ్యానించే కేసీ ఆర్ టీడీపీని, చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.