13, నవంబర్ 2010, శనివారం

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి మృతి


అమెరికా రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతి మృతి చెందింది. మరో యువతికి గాయాలయ్యాయి. గత రాత్రి వీరి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిద్దరూ సికింద్రాబాద్‌కు జనరల్‌ బజార్‌కు చెందిన వ్యాపారి కవల అక్కాచెల్లెళ్లు అర్చన, అర్పణగా వీరిని గుర్తించారు.

బీఫార్మసీ పూర్తి చేసి వీరు ఎమ్మెస్‌ చదివేందుకు అమెరికాలోని నాస్విల్‌టెన్నిస్‌కు రెండేళ్లక్రితం వెళ్లారు. ఈ డిసెంబర్‌లో చదువు పూర్తవుతుంది. ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంతో కవలల ఇంట విషాదం చోటు చేసుకొంది... వార్త తెలిసాక జనరల్‌ బజార్లోని పలువురు వ్యాపారులు షాప్స్ స్వచంద్మ్గా మూసివేసి సంతాపం ప్రకటించారు.