31, మార్చి 2011, గురువారం

భోపాల్‌ ఇకపై భోజ్‌పాల్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌ను ఇకపై భోజ్‌పాల్‌ పేరుగా వ్యవహరిస్తారు. రాజా భోజ్‌ 11వ శతాబ్దంలో మాల్పా ప్రాంతాన్ని పాలించాడు. మహ్మద్‌ గజనీపై 1024లో రాజాభోజ్‌ విజయం సాధించాడు. భోపాల్‌లో రాజాభోజ్‌ పట్టాభిషేకం మిల్లేనియం లేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివ రాజ్‌సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌కు భోజ్‌ పాల్‌ పేరును ప్రతిపాదించారు. భోపాల్‌లోని బడా తలావో సరస్సును ఇకపై 'భోజ్‌ తాల్‌' గా వ్యవహరిస్తారు. అలాగే విఐపిరోడ్‌ను 'రాజాభోజ్‌' మార్గ్‌గా పిలుస్తారు. బొంబాయి ని ముంబైగా, మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్‌కత్తా, బేంగళూర్‌ను బెంగుళూరుగా వ్యవహరిస్తున్నందున భోపాల్‌ను భోజ్‌పాల్‌గా ఎందుకు పరిగణించకూడదంటారు.